దర్శకుడు హరీష్ శంకర్ ఇవాళ ఆగ్రహం, ఆవేదన నిండిన స్వరంతో పంచులు కౌంటర్లు వేశారు. ఈగల్ సక్సెస్ మీట్ సందర్భంగా విచ్చేసిన ఆయన పలు అంశాల గురించి స్పష్టంగా మాట్లాడారు. తన ఫోటో పెట్టకుండా షాడో ఇమేజ్ వేసి స్టోరీలు రాసే కొన్ని మీడియా కథనాలను చూశానని, ఏదో గ్యాప్ వచ్చిందని, అయిదు సంవత్సరాలు సినిమా చేయలేదని ఏదేదో రాశారని, ఒకేసారి ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్ చేస్తున్న తాను త్వరలోపెద్ద హీరోలతో మరో రెండు చిత్రాలు ప్లాన్ చేశానని, వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా త్వరలోనే వస్తాయని నొక్కి మరీ చెప్పారు.
స్పీచులో ట్రోలింగ్ ప్రస్తావన వచ్చింది. ఇండస్ట్రీ రావాలని అనుకున్నప్పుడు అమ్మానాన్నాతో సహా బంధువులందరూ హరీష్ శంకర్ డైరెక్టర్ అవుతాడట వీడో పెద్ద మణిరత్నం మరి అంటూ ఎగతాళి చేసినవాళ్ళేనని కానీ విజయం సాధించి తానేంటో ఋజువు చేశానని, ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేసి పరిశ్రమకు వస్తారని, అన్నింటికి తెగించే ఉన్నామని కాస్తంత ఆవేశంగానే మాట్లాడారు. ఈ సందర్భంగానే రేటింగులు, రివ్యూల మీద సైతం అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సినీ జర్నలిజం ఇండస్ట్రీలో భాగమే కాబట్టి ఇద్దరం చెరో ఒడ్డు మీద లేమనే వాస్తవాన్ని గుర్తించాలని కోరారు.
మొత్తానికి హరీష్ శంకర్ మాటలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారుతున్నాయి. ఈగల్ తీసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లోనే ఆయన ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రైడ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ హీస్ట్ థ్రిల్లర్ వేసవిలోనే పూర్తి చేయబోతున్నారు. ఎన్నికలు అయ్యాక పవన్ కళ్యాణ్ డేట్స్ ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాలన్స్ ని ఫినిష్ చేయాలి. చిరంజీవితో ఓ సినిమా ఓకే అయ్యిందనే లీక్ వచ్చింది కానీ అధికార ప్రకటన వచ్చేదాకా ఖరారుగా చెప్పలేం. చిరు పేరు తెలిసిపోయింది కాబట్టి లిస్టులో ఉన్న ఇంకో హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
This post was last modified on February 11, 2024 11:14 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…