ఇప్పుడంటే తెలుగులో కనిపించడం తగ్గించేసింది కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు ఎంజాయ్ చేసిన డిమాండే వేరు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి రవితేజ లాంటి సీనియర్ల వరకు ఎన్నో సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న రకుల్ మొన్న సంక్రాంతికి రిలీజైన ఆయలాన్ లో శివ కార్తికేయన్ కు జోడిగా నటించింది. తెలుగులో రాలేదు కానీ తమిళంలో ఓ మోస్తరు కమర్షియల్ ఫలితాన్ని అందుకుంది. తాజాగా ప్యాన్ ఇండియా మూవీలో తనకో రిస్కీ పాత్ర ఆఫర్ వచ్చినట్టు ముంబై టాక్.
భారతీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇతిహాస గాధగా దర్శకుడు నితేష్ తివారి ప్లాన్ చేసుకున్న మూడు భాగాల రామాయణంకు క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాముడిగా రన్బీర్ కపూర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. సీతగా సాయిపల్లవి చేసేది లేనిది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. టాక్సిక్ లో బిజీగా ఉన్న యష్ రావణుడిగా చేసేది లేనిది అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం. కైకేయిగా లారా దత్త, విభీషణుడిగా విజయ్ సేతుపతిలను తీసుకున్నారు. మరి రకుల్ కి ఇవ్వబోయే క్యారెక్టర్ ఏంటనే పాయింటుకొద్దాం.
రావణాసురుడి చెల్లి శూర్ఫణఖ కోసం రకుల్ ని అడిగినట్టు ఇన్ సైడ్ టాక్. సాధారణంగా చాలా సీరియళ్ళలో ఆవిడను రాక్షసిగా చూపిస్తారు కానీ నిజానికి ఆమె గొప్ప అందగత్తె కాబట్టే లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడనే విధంగా కొన్ని పుస్తకాల్లో ఉంది. ఈ అంశాన్నే నితీష్ తివారి తెలివిగా హ్యాండిల్ చేస్తాడని అంటున్నారు. ఒకవేళ నెగటివ్ గా అనిపించకపోతే రకుల్ ఒప్పుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నటీనటులకు సంబంధించి అన్ని పేర్లు ఫైనల్ అయ్యాకే ఒక ప్రెస్ మీట్ ద్వారా వాటిని వెల్లడిస్తారట. అప్పటిదాకా ఈ అనధికార వార్తలలో సరిపెట్టుకోక తప్పదు.
This post was last modified on February 10, 2024 2:09 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…