ఇప్పుడంటే తెలుగులో కనిపించడం తగ్గించేసింది కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు ఎంజాయ్ చేసిన డిమాండే వేరు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి రవితేజ లాంటి సీనియర్ల వరకు ఎన్నో సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న రకుల్ మొన్న సంక్రాంతికి రిలీజైన ఆయలాన్ లో శివ కార్తికేయన్ కు జోడిగా నటించింది. తెలుగులో రాలేదు కానీ తమిళంలో ఓ మోస్తరు కమర్షియల్ ఫలితాన్ని అందుకుంది. తాజాగా ప్యాన్ ఇండియా మూవీలో తనకో రిస్కీ పాత్ర ఆఫర్ వచ్చినట్టు ముంబై టాక్.
భారతీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇతిహాస గాధగా దర్శకుడు నితేష్ తివారి ప్లాన్ చేసుకున్న మూడు భాగాల రామాయణంకు క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాముడిగా రన్బీర్ కపూర్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. సీతగా సాయిపల్లవి చేసేది లేనిది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. టాక్సిక్ లో బిజీగా ఉన్న యష్ రావణుడిగా చేసేది లేనిది అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం. కైకేయిగా లారా దత్త, విభీషణుడిగా విజయ్ సేతుపతిలను తీసుకున్నారు. మరి రకుల్ కి ఇవ్వబోయే క్యారెక్టర్ ఏంటనే పాయింటుకొద్దాం.
రావణాసురుడి చెల్లి శూర్ఫణఖ కోసం రకుల్ ని అడిగినట్టు ఇన్ సైడ్ టాక్. సాధారణంగా చాలా సీరియళ్ళలో ఆవిడను రాక్షసిగా చూపిస్తారు కానీ నిజానికి ఆమె గొప్ప అందగత్తె కాబట్టే లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడనే విధంగా కొన్ని పుస్తకాల్లో ఉంది. ఈ అంశాన్నే నితీష్ తివారి తెలివిగా హ్యాండిల్ చేస్తాడని అంటున్నారు. ఒకవేళ నెగటివ్ గా అనిపించకపోతే రకుల్ ఒప్పుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నటీనటులకు సంబంధించి అన్ని పేర్లు ఫైనల్ అయ్యాకే ఒక ప్రెస్ మీట్ ద్వారా వాటిని వెల్లడిస్తారట. అప్పటిదాకా ఈ అనధికార వార్తలలో సరిపెట్టుకోక తప్పదు.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…