Movie News

ఆలస్యంలో అనిరుధ్ వాటా ఎంత

విపరీతమైన డిమాండ్ లో ఉన్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తో పని చేయించుకోవడం తెలుగు దర్శకులకు కత్తి మీద సాములా మారిపోతోంది. ఏప్రిల్ 5 లాంటి మంచి డేట్ ని దేవర వదులుకోవడం పట్ల అభిమానులు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నారు. నెలల క్రితమే లాక్ చేసుకున్న తేదీని ఎందుకు రీచ్ కాలేకపోయారని నిలదీస్తున్నారు. ఊహించని విధంగా సైఫ్ అలీ ఖాన్ ప్రమాదానికి గురి కావడం ఒక కారణమైనా మరీ వారాల తరబడి మంచం మీద ఉండేంత తీవ్రమైంది కాకపోవడంతో అతి త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెడతాడనే టాక్ ఉంది. సో ఇబ్బంది లేదు.

ప్రధాన సమస్య అనిరుధ్ తోనే వస్తుందనేది స్పష్టం. దేవరకు ఎన్ని ట్యూన్స్ ఇచ్చాడో ఇప్పటిదాకా బయటికి తెలియకుండా టీమ్ గుంభనంగా ఉంటోంది. షూటింగ్ ప్రారంభమైన కొత్తల్లో దర్శకుడు కొరటాల శివతో డిస్కషన్ లో ఉన్నట్టుగా దిగిన ఫోటోలు తప్ప ఇంకెక్కడా అనిరుద్ కనిపించలేదు. తమిళ సినిమాలతో విపరీతమైన బిజీగా ఉన్నాడనుకున్నా అవసరమైన సమయం మనకూ ఇవ్వాలిగా. ఇంత టైట్ షెడ్యూల్స్ లోనూ గౌతమ్ తిన్ననూరి కోసం చిన్న బడ్జెట్ సినిమా మ్యాజిక్ ఒప్పుకోవడం వెనుక ఆంతర్యం అనిరుద్ కే ట్ తెలియాలి. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

ఇతను ఎప్పటిలోగా పాటల ఫైనల్ వెర్షన్ ఇస్తాడు, రీ రికార్డింగ్ కి ఎంత సమయం డిమాండ్ చేస్తాడనే దాన్ని బట్టే దేవర కొత్త రిలీజ్ డేట్ ని సెట్ చేసుకోవాలి. అంతే తప్ప తొందరపడి ఏదో ఒకటి ప్రకటించి, మళ్ళీ వాయిదా వేసుకునే పరిస్థితి తెచ్చుకుని ఫ్యాన్స్ తో మాటలు పడకూడదు. టీజర్ కిచ్చిన బీజీఎమ్ కూడా మరీ గొప్పగా లేదు. ఒకవేళ సాంగ్స్ రెడీగా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో కొరటాల శివ వాటి షూట్ పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. వెయిట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. కనీసం ఒక్క లిరికల్ వీడియో వదిలి ఉన్నా కాస్త భరోసా దక్కేది.

This post was last modified on February 10, 2024 12:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago