ఇప్పుడీ ప్రశ్న మన దేశంలో భారీ ఎత్తున ఓటిటి బిజినెస్ చేస్తున్న బడా సంస్థలను వేధిస్తోంది. మొన్నటి సంవత్సరం దాకా గ్లోబల్ కంటెంట్ పేరుతో కేవలం ఫారిన్, ఇంగ్లీష్, హిందీ బాషలకే ప్రాధాన్యం ఇస్తూ సౌత్ మార్కెట్ ని నిర్లక్ష్యం చేయడం ఎంత పెద్ద తప్పో నెట్ ఫ్లిక్స్ కి అర్థమయ్యింది. కాస్త ఆలస్యంగా దానికి తగ్గట్టే బిజినెస్ ప్లాన్ మొత్తం మార్చేసుకుంది. పెద్ద హీరోల సినిమాలు ఆచి తూచి స్ట్రీమింగ్ చేసే ట్రెండ్ లో కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, యానిమల్, గుంటూరు కారంలను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేయడం ఒక్కసారిగా మార్కెట్ ని కుదిపేసింది.
గతంలో ఈ డామినేషన్ అమెజాన్ ప్రైమ్ నుంచి ఎక్కువగా ఉండేది. కరోనా టైంలో నారప్ప, దృశ్యం 2, నాని వి, టక్ జగదీశ్, ఆకాశం నీ హద్దురా లాంటి క్రేజీ చిత్రాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడం ద్వారా బాగా లాభ పడింది. కానీ తర్వాత వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమాలు కొనడం తగ్గించింది. ఈ గ్యాప్ ని నెట్ ఫ్లిక్స్ వాడుకుని వందా రెండు వందలు కాదు ఏకంగా వెయ్యి నుంచి రెండు వేల కోట్ల దాకా పెట్టుబడులు సిద్ధం చేసుకుని ప్యాన్ ఇండియా మూవీస్ కొనేసుకుంటూ వెళ్తోంది. అందుకే ఎంత పోటీ ఉన్నా దేవర, పుష్ప 2 లాంటివి నెట్ ఫ్లిక్స్ చేతికి వచ్చాయి.
రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. నిర్మాతలు ఒకపక్క ఓటిటి మార్కెట్ తగ్గుతోందని టెన్షన్ పడుతున్న టైంలో పెద్ద హీరోలకు మాత్రం నెట్ ఫ్లిక్స్ గ్యారెంటీ ఆదాయ వనరుగా మారింది. హాట్ స్టార్ ఈ కాంపిటీషన్ తట్టుకునేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన నెట్ ఫ్లిక్స్ సిఈఓ టాలీవుడ్ సెలెబ్రిటీస్ అందరినీ ఇంటికి వెళ్లి కలవడం వెనుక మతలబు ఏంటో అర్థమయ్యిందిగా. ఇకపై కూడా ఇదే దూకుడు కొనసాగిస్తే మళ్ళీ మునుపటి లాగా ఓటిటిల మధ్య విపరీత పోటీ పెరిగి హక్కుల రూపంలో నిర్మాతలకు ఆదాయం పెరగడం ఖాయం.
This post was last modified on February 10, 2024 1:18 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…