టాలీవుడ్ కమెడియన్లలో వెన్నెల కిషోర్ది ప్రత్యేకమైన శైలి. ముందు తరం ప్రేక్షకులను మెప్పించే ఓవర్ ద టాప్ కామెడీ చేయగలడు. అలాగే ఈ తరం ప్రేక్షకులను సటిల్ కామెడీతోనూ మెప్పించగలడు. తన పాత్రల్లో ఓ మోస్తరు కంటెంట్ ఉన్నా చాలు.. వాటిని తనదైన టైమింగ్తో మరో స్థాయికి తీసుకెళ్లగల నైపుణ్యం అతడి సొంతం. ఇలాంటి నటుడిని ఫుల్ లెంగ్త్లో వాడుకోవడానికి ఓ టీం రెడీ అయింది. వెన్నెల కిషోర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రమే. చారి 111. కొన్ని నెలల కిందటే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
ఒక యానిమేటెడ్ వీడియోతో వెన్నెల కిషోర్ పాత్రకు ఇంట్రో ఇస్తూ సినిమాను అనౌన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కిషోర్ది ప్రత్యేకమైన కామెడీ టైమింగ్. అతడికి వెర్రి వెంగళప్ప పాత్రలు ఇస్తే అదరగొడతాడు. టిపికల్ క్యారెక్టర్లను బాగా పోషిస్తాడు. ‘చారి 111’లో తాను కన్ఫ్యూజ్ అయి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఒక తింగరి ఏజెంట్ పాత్రలో అతను కనిపించబోతున్నాడు. సినిమానుto అనౌన్స్ చేశాక పెద్దగా హడావుడి చేయకుండా సైలెంట్గా షూట్ పూర్తి చేసిన చిత్ర బృందం.. అప్పుడే మూవీని రిలీజ్కు రెడీ చేసింది. మార్చి 1న చారి 111 విడుదల కాబోతున్నట్లు టీం ప్రకటించింది.
అదితి సోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు. మార్చి 1న ఆల్రెడీ వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ షెడ్యూల్ అయి ఉంది. అలాంటి పేరున్న సినిమాకు పోటీగా చారి 111ను దింపుతున్నారంటే సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లే. మరి వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో ఏమేర నవ్వులు పండిస్తాడో.. ప్రేక్షకులను ఎంతమేర థియేటర్లకు రప్పిస్తాడో.. ఈ చిత్రానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on February 9, 2024 9:46 am
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…