సినిమాలకు సంబంధించి సమ్మర్ సీజన్ సాధారణంగా మార్చి నెలాఖర్లో మొదలవుతుంటుంది. మార్చి మూడో వారానికి ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత వేర్వేరు తరగతుల విద్యార్థులు పరీక్షలు ముగించుకుని సినిమాల వైపు మళ్లుతారు. ఏప్రిల్లో బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది. ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మూడో వారం వరకు అన్ సీజన్గానే భావిస్తారు. ఆ సమయంలో కొత్త సినిమాలకు వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండవు. అందుకే క్రేజున్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు.
కానీ కరోనా తర్వాత లెక్కలు మారి.. ఈ అన్ సీజన్ అనుకునే రోజుల్లోనూ మిడ్ రేంజ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈసారి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఏడాది టాలీవుడ్లో వేసవి సందడి చాలా ముందుగానే మొదలైపోతోంది.
ఫిబ్రవరిలో ఈగల్, ఊరు పేరు భైరవ కోన లాంటి క్రేజున్న సినిమాలు థియేటర్లను కళకళలాడించేలా కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు వారాల్లో కొంచెం బాక్సాఫీస్ డల్లుగా మారబోతోంది. కానీ మార్చి ఆరంభం నుంచి వేసవి విందు మొదలైపోనుంది. తొలి వారమే ఆపరేషన్ వాలెంటైన్ లాంటి పేరున్న సినిమా విడుదల కాబోతోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో పెద్ద స్థాయిలోనే రిలీజ్ కానుంది. తర్వాతి వారం గోపీచంద్ మాస్ మూవీ భీమా రానుంది. దీనికి తోడుగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసిన గామి విడుదల కానుంది. అతడి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రావాల్సిన రోజుకే గామిని ఫిక్స్ చేశారు. ఆ వీకెండ్లో సినీ ప్రియులకు మంచి విందు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు మార్చిలోనే టిట్లు స్క్వేర్ లాంటి క్రేజీ మూవీ విడుదల కాబోతోంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే పెద్ద సినిమాల సందడి వేరే స్థాయిలోనే ఉండబోతోంది.
This post was last modified on February 8, 2024 8:03 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…