సినిమాలకు సంబంధించి సమ్మర్ సీజన్ సాధారణంగా మార్చి నెలాఖర్లో మొదలవుతుంటుంది. మార్చి మూడో వారానికి ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత వేర్వేరు తరగతుల విద్యార్థులు పరీక్షలు ముగించుకుని సినిమాల వైపు మళ్లుతారు. ఏప్రిల్లో బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది. ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మూడో వారం వరకు అన్ సీజన్గానే భావిస్తారు. ఆ సమయంలో కొత్త సినిమాలకు వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండవు. అందుకే క్రేజున్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు.
కానీ కరోనా తర్వాత లెక్కలు మారి.. ఈ అన్ సీజన్ అనుకునే రోజుల్లోనూ మిడ్ రేంజ్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈసారి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఏడాది టాలీవుడ్లో వేసవి సందడి చాలా ముందుగానే మొదలైపోతోంది.
ఫిబ్రవరిలో ఈగల్, ఊరు పేరు భైరవ కోన లాంటి క్రేజున్న సినిమాలు థియేటర్లను కళకళలాడించేలా కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు వారాల్లో కొంచెం బాక్సాఫీస్ డల్లుగా మారబోతోంది. కానీ మార్చి ఆరంభం నుంచి వేసవి విందు మొదలైపోనుంది. తొలి వారమే ఆపరేషన్ వాలెంటైన్ లాంటి పేరున్న సినిమా విడుదల కాబోతోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో పెద్ద స్థాయిలోనే రిలీజ్ కానుంది. తర్వాతి వారం గోపీచంద్ మాస్ మూవీ భీమా రానుంది. దీనికి తోడుగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసిన గామి విడుదల కానుంది. అతడి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రావాల్సిన రోజుకే గామిని ఫిక్స్ చేశారు. ఆ వీకెండ్లో సినీ ప్రియులకు మంచి విందు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు మార్చిలోనే టిట్లు స్క్వేర్ లాంటి క్రేజీ మూవీ విడుదల కాబోతోంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే పెద్ద సినిమాల సందడి వేరే స్థాయిలోనే ఉండబోతోంది.
This post was last modified on February 8, 2024 8:03 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…