సుకుమార్ సినిమాలంటే ఒక పట్టాన సెట్స్ మీదికి వెళ్లవు. వెళ్లాక కూడా షూటింగ్ అనుకున్నట్లుగా సాగదు. పోస్ట్ ప్రొడక్షన్లోనూ ఆలస్యం జరగడం అనివార్యం. రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేయడం కూడా సాధారణంగా జరిగే క్రతువే. ‘పుష్ప-2’ విషయంలో ఇవన్నీ జరిగాయి. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. చిత్రీకరణలో ఆలస్యం వల్ల ఈ ఏడాది ఆగస్టు 15కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
చాలా ముందుగానే ఈ డేట్ ప్రకటించడం.. సుకుమార్ కోరుకున్నంత టైం నిర్మాతలు ఇవ్వడంతో ఈసారి పక్కాగా ఆ డేట్కు సినిమా వస్తుందనే అంతా అనుకున్నారు. కొన్ని నెలలుగా ‘పుష్ప-2’ షూటింగ్ కూడా జోరుగానే సాగుతోంది. ఆగస్టు 15న పుష్ప విందుకు అందరూ రెడీ అయిపోయిన టైంలో మళ్లీ వాయిదా వార్తలు ఊపందుకున్నాయి.
షూటింగ్ ఆలస్యం అవుతుండటం.. బహు భాషల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా జాప్యం జరిగే సూచనలుండడంతో ఆగస్టు 15 విడుదల కష్టమే అని వార్తలు వచ్చాయి. పుష్ప-2 స్థానంలోకి దేవర వస్తుందని.. నాని సినిమా సరిపోదా శనివారం కూడా ఆ డేట్ మీద కన్నేసిందని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ఆ డేట్ మీద కన్నేశాయి. కానీ పుష్ప-2 యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా వాయిదా పడే అవకాశం లేదట. చిత్రీకరణ ఇప్పటిదాకా 65 శాతం దాకా పూర్తి కాగా.. వచ్చే మూడు నెలల్లో మొత్తం పని పూర్తయ్యేలా ప్రణాళికలు వేశారట.
వేర్వేరు యూనిట్లను ఏర్పాటు చేసి సుకుమార్ పర్యవేక్షణలో చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో మేకల్లా షూట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అప్పట్నుంచి సుకుమార్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోతారట. జులై నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ తీసేయాలని చూస్తున్నారట.
This post was last modified on February 8, 2024 2:01 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…