సుకుమార్ సినిమాలంటే ఒక పట్టాన సెట్స్ మీదికి వెళ్లవు. వెళ్లాక కూడా షూటింగ్ అనుకున్నట్లుగా సాగదు. పోస్ట్ ప్రొడక్షన్లోనూ ఆలస్యం జరగడం అనివార్యం. రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేయడం కూడా సాధారణంగా జరిగే క్రతువే. ‘పుష్ప-2’ విషయంలో ఇవన్నీ జరిగాయి. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. చిత్రీకరణలో ఆలస్యం వల్ల ఈ ఏడాది ఆగస్టు 15కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
చాలా ముందుగానే ఈ డేట్ ప్రకటించడం.. సుకుమార్ కోరుకున్నంత టైం నిర్మాతలు ఇవ్వడంతో ఈసారి పక్కాగా ఆ డేట్కు సినిమా వస్తుందనే అంతా అనుకున్నారు. కొన్ని నెలలుగా ‘పుష్ప-2’ షూటింగ్ కూడా జోరుగానే సాగుతోంది. ఆగస్టు 15న పుష్ప విందుకు అందరూ రెడీ అయిపోయిన టైంలో మళ్లీ వాయిదా వార్తలు ఊపందుకున్నాయి.
షూటింగ్ ఆలస్యం అవుతుండటం.. బహు భాషల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా జాప్యం జరిగే సూచనలుండడంతో ఆగస్టు 15 విడుదల కష్టమే అని వార్తలు వచ్చాయి. పుష్ప-2 స్థానంలోకి దేవర వస్తుందని.. నాని సినిమా సరిపోదా శనివారం కూడా ఆ డేట్ మీద కన్నేసిందని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ఆ డేట్ మీద కన్నేశాయి. కానీ పుష్ప-2 యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా వాయిదా పడే అవకాశం లేదట. చిత్రీకరణ ఇప్పటిదాకా 65 శాతం దాకా పూర్తి కాగా.. వచ్చే మూడు నెలల్లో మొత్తం పని పూర్తయ్యేలా ప్రణాళికలు వేశారట.
వేర్వేరు యూనిట్లను ఏర్పాటు చేసి సుకుమార్ పర్యవేక్షణలో చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో మేకల్లా షూట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అప్పట్నుంచి సుకుమార్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోతారట. జులై నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ తీసేయాలని చూస్తున్నారట.
This post was last modified on February 8, 2024 2:01 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…