సుకుమార్ సినిమాలంటే ఒక పట్టాన సెట్స్ మీదికి వెళ్లవు. వెళ్లాక కూడా షూటింగ్ అనుకున్నట్లుగా సాగదు. పోస్ట్ ప్రొడక్షన్లోనూ ఆలస్యం జరగడం అనివార్యం. రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేయడం కూడా సాధారణంగా జరిగే క్రతువే. ‘పుష్ప-2’ విషయంలో ఇవన్నీ జరిగాయి. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. చిత్రీకరణలో ఆలస్యం వల్ల ఈ ఏడాది ఆగస్టు 15కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
చాలా ముందుగానే ఈ డేట్ ప్రకటించడం.. సుకుమార్ కోరుకున్నంత టైం నిర్మాతలు ఇవ్వడంతో ఈసారి పక్కాగా ఆ డేట్కు సినిమా వస్తుందనే అంతా అనుకున్నారు. కొన్ని నెలలుగా ‘పుష్ప-2’ షూటింగ్ కూడా జోరుగానే సాగుతోంది. ఆగస్టు 15న పుష్ప విందుకు అందరూ రెడీ అయిపోయిన టైంలో మళ్లీ వాయిదా వార్తలు ఊపందుకున్నాయి.
షూటింగ్ ఆలస్యం అవుతుండటం.. బహు భాషల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా జాప్యం జరిగే సూచనలుండడంతో ఆగస్టు 15 విడుదల కష్టమే అని వార్తలు వచ్చాయి. పుష్ప-2 స్థానంలోకి దేవర వస్తుందని.. నాని సినిమా సరిపోదా శనివారం కూడా ఆ డేట్ మీద కన్నేసిందని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ఆ డేట్ మీద కన్నేశాయి. కానీ పుష్ప-2 యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా వాయిదా పడే అవకాశం లేదట. చిత్రీకరణ ఇప్పటిదాకా 65 శాతం దాకా పూర్తి కాగా.. వచ్చే మూడు నెలల్లో మొత్తం పని పూర్తయ్యేలా ప్రణాళికలు వేశారట.
వేర్వేరు యూనిట్లను ఏర్పాటు చేసి సుకుమార్ పర్యవేక్షణలో చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో మేకల్లా షూట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అప్పట్నుంచి సుకుమార్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోతారట. జులై నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ తీసేయాలని చూస్తున్నారట.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…