సుకుమార్ సినిమాలంటే ఒక పట్టాన సెట్స్ మీదికి వెళ్లవు. వెళ్లాక కూడా షూటింగ్ అనుకున్నట్లుగా సాగదు. పోస్ట్ ప్రొడక్షన్లోనూ ఆలస్యం జరగడం అనివార్యం. రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేయడం కూడా సాధారణంగా జరిగే క్రతువే. ‘పుష్ప-2’ విషయంలో ఇవన్నీ జరిగాయి. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. చిత్రీకరణలో ఆలస్యం వల్ల ఈ ఏడాది ఆగస్టు 15కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
చాలా ముందుగానే ఈ డేట్ ప్రకటించడం.. సుకుమార్ కోరుకున్నంత టైం నిర్మాతలు ఇవ్వడంతో ఈసారి పక్కాగా ఆ డేట్కు సినిమా వస్తుందనే అంతా అనుకున్నారు. కొన్ని నెలలుగా ‘పుష్ప-2’ షూటింగ్ కూడా జోరుగానే సాగుతోంది. ఆగస్టు 15న పుష్ప విందుకు అందరూ రెడీ అయిపోయిన టైంలో మళ్లీ వాయిదా వార్తలు ఊపందుకున్నాయి.
షూటింగ్ ఆలస్యం అవుతుండటం.. బహు భాషల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా జాప్యం జరిగే సూచనలుండడంతో ఆగస్టు 15 విడుదల కష్టమే అని వార్తలు వచ్చాయి. పుష్ప-2 స్థానంలోకి దేవర వస్తుందని.. నాని సినిమా సరిపోదా శనివారం కూడా ఆ డేట్ మీద కన్నేసిందని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ఆ డేట్ మీద కన్నేశాయి. కానీ పుష్ప-2 యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా వాయిదా పడే అవకాశం లేదట. చిత్రీకరణ ఇప్పటిదాకా 65 శాతం దాకా పూర్తి కాగా.. వచ్చే మూడు నెలల్లో మొత్తం పని పూర్తయ్యేలా ప్రణాళికలు వేశారట.
వేర్వేరు యూనిట్లను ఏర్పాటు చేసి సుకుమార్ పర్యవేక్షణలో చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో మేకల్లా షూట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అప్పట్నుంచి సుకుమార్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోతారట. జులై నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ తీసేయాలని చూస్తున్నారట.
This post was last modified on February 8, 2024 2:01 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…