Movie News

రాంబాబు థియేటర్లలో పొలిటికల్ సెగలు

ఇవాళ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబుని రీ రిలీజ్ చేశారు. కొంచెం గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద పవర్ స్టార్ దర్శనం కావడంతో అభిమానులు భారీగా స్పెషల్ షోలకు వెళ్లారు. ముఖ్యంగా ఉదయం వేసిన ఆటలకు మంచి స్పందన దక్కింది. అయితే తెలంగాణ థియేటర్లలో కొన్ని నెలల నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబందించిన యాడ్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రంలో కోట్లు ఖర్చు పెట్టి ఎందుకీ ప్రచారం అంటే ఏపీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళ కోసమని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడీ పబ్లిసిటీనే రాంబాబు హాళ్లల్లో సెగలు పుట్టించింది.

ఏం జరిగిందంటే సినిమా ప్రారంభానికి ముందు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాల యాడ్ మొదలైంది. దాంట్లో జగన్ మాట్లాడుతున్న వీడియో కూడా ఉంటుంది. ఇంకేముంది జనసేన సైనికులు ప్లస్ పవన్ అభిమానులకు కోపం వచ్చేసింది. ప్రొజెక్టర్ కు చేతులు అడ్డుపెట్టి ఒకరు, స్క్రీన్ పైకి వస్తువులు చెప్పులు విసిరి మరొకరు ఇలా రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన ఆపరేటర్ వెంటనే వాటిని ఆపేసి నేరుగా నెక్స్ట్ కంటెంట్ కి వెళ్లిపోవడం గమనార్హం. పలు చోట్ల ఇలాంటి సీన్లే కనిపించాయి. పవన్ సినిమాలో జగన్ బొమ్మ చూపిస్తే ఇంతేగా.

కెమెరామెన్ గంగతో రాంబాబులో పొలిటికల్ సెటైర్లు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా నటించిన ప్రకాష్ రాజ్ – కోట శ్రీనివాసరావు మధ్య సీన్లు బాగా పేలాయి. అయితే కొన్ని కీలకమైన ఒకటిరెండు సన్నివేశాలు కత్తెరకు గురి కావడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. సెలబ్రేషన్స్ అయితే బాగానే చేసుకున్నారు. యాత్ర 2 రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో దానికి కౌంటర్ గానే రాంబాబుని రీ రిలీజ్ చేశామని, ప్రతి టికెట్ మీద పది రూపాయలు జనసేనకు విరాళంగా వెళ్తుందని డిస్ట్రిబ్యూటర్ ప్రకటించడం తెలిసిన విషయమే. ఈ స్పందనకు అదీ ఒక కారణం.

This post was last modified on February 7, 2024 3:53 pm

Share
Show comments

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago