Movie News

నిశ్శబ్దంగా పని చేసుకుంటున్న ఈగల్

మాస్ మహారాజా కొత్త సినిమా అంటేనే అదో సెలబ్రేషన్ లా ఉంటుంది అభిమానులకు. కానీ ఈగల్ విషయంలో ఆ స్థాయి బజ్ కనిపించడం లేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కంటెంట్ మీద నమ్మకంతో దర్శక నిర్మాతలు ఓవర్ పబ్లిసిటీ చేయకపోవడం వల్లే లో ప్రొఫైల్ కొనసాగుతోంది. హీరో రవితేజ, నిర్మాత టిజి విశ్వప్రసాద్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇస్తున్న ఇంటర్వ్యూలలో చాలా కూల్ గా ఇందులో ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నారు కానీ ఓవర్ గా ఎలివేట్ చేసి చెప్పడం కానీ, లేనిపోని బిల్డప్ లు ఇవ్వడం కానీ ఏ కోశానా చేయడం లేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ మరీ భీకరంగా లేకపోయినా ఉదయం ఆట అయ్యాక ఒక్కసారిగా టాక్ వచ్చే మార్పు అనూహ్యంగా ఉంటుందని టీమ్ నమ్ముతోంది. టీజర్, ట్రైలర్ లో ట్విస్టులు రివీల్ కాకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తగా కట్ చేయడం వల్ల ఇదేదో యాక్షన్ మూవీ అనుకున్న ప్రేక్షకులు చాలానే ఉన్నారు. కానీ ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్ లో పత్తి రైతుల సమస్య బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించని ట్రీట్ మెంట్ ని ఈగల్ రూపించారట. ముఖ్యంగా చివరి ముప్పావు గంట ఊహించని ఎలివేషన్లతో కట్టి పారేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. హీరో, ప్రొడ్యూసర్ ఇద్దరూ అదే మాట అంటున్నారు.

ఇది సక్సెస్ కావడం రవితేజకు చాలా కీలకం. ధమాకా సోలో బ్లాక్ బస్టర్ తర్వాత రెండు ఫ్లాపులు వచ్చాయి. రావణాసుర కాన్సెప్ట్ ఫెయిల్ కాగా, టైగర్ నాగేశ్వరరావుకు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. అందుకే ఈగల్ ఆ గాయాలను తుడిచేస్తుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. అయితే ఇంగ్లీష్ టైటిల్ మాస్ కి తొందరగా రీచ్ కావడం లేదు. కంటెంట్ బాగుంటే ఇదేమీ పెద్ద సమస్య కాదు. స్టైల్, యాక్షన్, కమర్షియాలిటీ ఈ మూడింటిని కార్తీక్ ఎలా బ్యాలన్స్ చేశాడనే దాని మీద మెప్పించడం ఆధారపడి ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.

This post was last modified on February 7, 2024 4:05 pm

Share
Show comments

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

1 hour ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago