నాలుగేళ్ల కిందట పి.వి.సింధు రియో ఒలింపిక్స్లో సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సంపాదించుకుంది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సింధు గురించి విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించారు.
అయితే మిగతా వాళ్లందరూ ఆమె ఎలా ఈ స్థాయికి వచ్చింది.. కెరీర్ విశేషాలేంటి.. కుటుంబం, ఇతర వ్యక్తిగత సంగతులేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మన తెలుగు జనాలు మాత్రం ఇంటర్నెట్లో ఆమె కులం కోసం సెర్చ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది.
గూగుల్లో సింధు అని పేరు కొట్టగానే పక్కన క్యాస్ట్ అనే పదం డీఫాల్ట్గా రావడం ఇందుకు నిదర్శనం. ఈ విషయమై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా సరే.. మనోళ్లలో పెద్దగా మార్పు కనిపించలేదు.
సోషల్ మీడియా జోరు పెరిగాక ఈ కుల సంబంధిత చర్చలు, వాదోపవాదాలు మరీ ఎక్కువైపోయాయి. తాజాగా బిగ్ బాస్ షో మొదలైన నేపథ్యంలో అందులో పార్టిసిపెంట్ల కులాల గురించి ఇప్పుడు చర్చ నడుస్తుండటం గమనార్హం.
యాంకర్ లాస్య హౌస్లోకి అడుగు పెట్టగానే ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిందని.. ఆమెకు సపోర్ట్ చేద్దామని ఒక వర్గం వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. మరోవైపు గంగవ్వ మున్నూరు కాపు అని.. ఆమెను గెలిపించుకుందామని ఇంకో వర్గం ప్రచారం మొదలుపెట్టింది.
మిగతా పార్టిసిపెంట్లలో కొందరి కులాలు కూడా వెలికితీసే ప్రయత్నం జరిగింది. ఇది చూసి తెలుగు రాష్ట్రాల జనాల్లో కుల పిచ్చి ఈ స్థాయికి చేరిందేంటంటూ విజ్ఞులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనవాళ్లు మారరని, ఈ జాఢ్యం ఎప్పటికి వదులుతుందో అని నిట్టూరుస్తున్నారు.
This post was last modified on September 8, 2020 10:55 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…