విడుదలైన పాతిక రోజులకే హనుమాన్ సగర్వంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టాడు. ఇవాళ టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ముందు చిన్న సినిమాగా ముద్ర వేయించుకుని, మొదటిరోజు హైదరాబాద్ లో కేవలం నాలుగు సింగల్ స్క్రీన్లు మాత్రమే దక్కించుకున్న స్టేజి నుంచి మొత్తం పండగ చిత్రాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దాకా ప్రయాణం చేసిన హనుమాన్ విజయాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. తేజ సజ్జ లాంటి అప్ కమింగ్ హీరోతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏకంగా బాహుబలి రికార్డులకే ఎసరు పెట్టడం కొన్నేళ్ల పాటు చెప్పుకునే చరిత్రగా మిగలనుంది.
గత కొన్నిరోజులుగా హనుమాన్ వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతాలు మళ్ళీ తన కంట్రోల్ లోకే వస్తున్నాయి. కొత్తగా రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు కన్న చాలా చోట్ల మొన్న ఆదివారం వసూళ్లు హనుమాన్ కే బాగుండటం గమనించాల్సిన విషయం. షేర్ రూపంలో ఇప్పటికే నూటా అరవై కోట్లకు పైగా రాబట్టి తొంబై అయిదేళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడం మాములు మైలురాయి కాదు. ఈ వారం రవితేజ ఈగల్, యాత్ర 2, లాల్ సలామ్ లు వస్తున్న నేపథ్యంలో హనుమాన్ కౌంట్ తగ్గిపోనుంది. డైరెక్ట్ సెంటర్స్ కొనసాగబోతున్నాయి.
ఇలా నాలుగు వారాల పాటు స్టడీ రన్ దక్కించుకున్న హనుమాన్ టీమ్ ముందు నుంచి వ్యక్తం చేస్తూ వచ్చిన నమ్మకమే నిజమయ్యింది. గుంటూరు కారం లాంటి భారీ పోటీని తట్టుకుని విజేతగా నిలవడం ఎవరూ ఊహించనిది. ఇంత సాధించినా టీమ్ రిలాక్స్ అవ్వలేదు. యుఎస్ లో ప్రమోషన్లు చేయడంలో బిజీగా ఉంది. ఫైనల్ రన్ ఇంకా ఉంది కాబట్టి ఓటిటి ప్రీమియర్ సైతం మార్చికి వాయిదా వేశారనే సంగతి తెలిసిందే. కేవలం ముప్పై కోట్ల థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బి బరిలో దిగి నూటా అరవై కోట్లను దాటేయడమంటే నభూతో నభవిష్యత్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది.
This post was last modified on February 6, 2024 11:56 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…