గత వారాంతంలో రెండంకెల సంఖ్యలో కొత్త సినిమాలు వచ్చాయి తెలుగులో. కానీ వాటిలో చాలా సినిమాల పేర్లు కూడా జనాలకు పరిచయం లేదు. వీటిలో చాలా సినిమాలు నామమాత్రంగానే రిలీజయ్యాయి. కనీస స్థాయిలో కూడా ప్రేక్షకుల దృష్టిని అవి ఆకర్షించలేదు. ఈ చిన్న సినిమాల వరదలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది ఒక్క ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మాత్రమే.
ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని రూపొందించిన ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్-2 అధినేత బన్నీ వాసు, వెంకటేష్ మహాల బ్యాకప్ లభించింది. గీతా ఆర్ట్స్ పేరు పోస్టర్ మీదికి రావడంతోనే ఈ సినిమాకు ఒక బజ్ వచ్చింది. రిలీజ్ ముంగిట పబ్లిసిటీ కూడా బాగా చేశారు. పెయిడ్ ప్రిమియర్స్ కూడా ప్లస్ అయ్యాయి.
ఐతే సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. సినిమా పర్వాలేదు అనే టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో పెయిడ్ ప్రిమియర్స్ తర్వాత తొలి రోజు కలెక్షన్లు కొంచెం అటు ఇటుగా వచ్చాయి. దీంతో సినిమా నిలడడుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ పడుతూ లేస్తూ బాగానే నెట్టుకొస్తోంది. వసూళ్లు మరీ గొప్పగా లేవు. అలా అని తీసిపడేసేలా లేవు. వీకెండ్లో వరల్డ్ వైడ్ షేర్ రూ.5 కోట్లకు చేరువగా వచ్చింది. ఈ సినిమా రేంజికి ఇది పెద్ద నంబరే.
సినిమా సూపర్ అనిపించకపోయినా.. తీసిపడేసేలా లేకపోవడం, పోటీలో ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దీనికి ప్లస్ అయింది. ఈ వారం ‘ఈగల్’ వస్తోంది కాబట్టి ‘అంబాజీపేట..’ సెకండ్ వీకెండ్ మీద పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. ఆ లోపు ఎంత వీలైతే అంత రాబట్టుకోవడమే. అంతిమంగా ఈ సినిమా రేంజికి వస్తున్న వసూళ్లు చూస్తే ఇది సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడుతున్నట్లే.
This post was last modified on February 5, 2024 4:38 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…