బిగ్బాస్ 4 హౌస్లోకి పదహారు మంది వెళ్లారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్సయిటింగ్ కంటెస్టెంట్ లేడనే కామెంట్లు పడుతున్నాయి. ఎక్కువ మంది యూట్యూబ్, సోషల్ మీడియా సెలబ్రిటీలను హౌస్లోకి పంపించారు. లోనికి వెళ్లిన వారిలో చాలా మంది పేర్లు కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులకు తెలియవు. సినిమా వినోదం అంతగా లేని టైమ్లో నిర్వహిస్తోన్న ఈ సీజన్కి ఖచ్చితంగా ఆడియన్స్ బాగుంటారని స్టార్మా నెట్వర్క్ కి తెలుసు. అయినా కానీ ఎందుకని స్టార్ కంటెస్టెంట్స్ని తీసుకోలేదు? కరోనా భయంతో రైజింగ్లో వున్న పాపులర్ సెలబ్రిటీలు ఎవరూ హౌస్లోకి వెళ్లే రిస్క్ తీసుకునేందుకు ముందుకు రాలేదు. నెక్స్ట్ సీజన్కి వస్తామని ఎవరికి వారు ఆఫర్ రిజెక్ట్ చేసారట.
అయితే సీజన్ చేసి తీరాలని డిసైడ్ అవడంతో అందుబాటులో వున్న వారిలోనే తమకు బెస్ట్ ఆప్షన్ అనుకున్నవారిని ఎంచుకున్నారట. అయితే ఇది ఒక రకంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్కి ప్లస్ అవుతుంది. తేజస్వి, బాబు గోగినేని, శ్రీముఖి లాంటి స్టార్లు వుంటే పోటీ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్లిన వారిలో ఎవరికీ అంతగా ఫాన్ బేస్ లేదు కనుక వాళ్లు గేమ్ ఆడే విధానం, వాళ్ల పద్ధతులతోనే ప్రేక్షకులను గెలుచుకోవాలి. అయితే స్టార్ ఆకర్షణలు లేని ఈ స్టార్ మా పోగ్రామ్ మునుపటిలా భారీ టీఆర్పీలు దక్కించుకోగలదా?
This post was last modified on September 7, 2020 8:28 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…