బిగ్బాస్ 4 హౌస్లోకి పదహారు మంది వెళ్లారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్సయిటింగ్ కంటెస్టెంట్ లేడనే కామెంట్లు పడుతున్నాయి. ఎక్కువ మంది యూట్యూబ్, సోషల్ మీడియా సెలబ్రిటీలను హౌస్లోకి పంపించారు. లోనికి వెళ్లిన వారిలో చాలా మంది పేర్లు కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులకు తెలియవు. సినిమా వినోదం అంతగా లేని టైమ్లో నిర్వహిస్తోన్న ఈ సీజన్కి ఖచ్చితంగా ఆడియన్స్ బాగుంటారని స్టార్మా నెట్వర్క్ కి తెలుసు. అయినా కానీ ఎందుకని స్టార్ కంటెస్టెంట్స్ని తీసుకోలేదు? కరోనా భయంతో రైజింగ్లో వున్న పాపులర్ సెలబ్రిటీలు ఎవరూ హౌస్లోకి వెళ్లే రిస్క్ తీసుకునేందుకు ముందుకు రాలేదు. నెక్స్ట్ సీజన్కి వస్తామని ఎవరికి వారు ఆఫర్ రిజెక్ట్ చేసారట.
అయితే సీజన్ చేసి తీరాలని డిసైడ్ అవడంతో అందుబాటులో వున్న వారిలోనే తమకు బెస్ట్ ఆప్షన్ అనుకున్నవారిని ఎంచుకున్నారట. అయితే ఇది ఒక రకంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్కి ప్లస్ అవుతుంది. తేజస్వి, బాబు గోగినేని, శ్రీముఖి లాంటి స్టార్లు వుంటే పోటీ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్లిన వారిలో ఎవరికీ అంతగా ఫాన్ బేస్ లేదు కనుక వాళ్లు గేమ్ ఆడే విధానం, వాళ్ల పద్ధతులతోనే ప్రేక్షకులను గెలుచుకోవాలి. అయితే స్టార్ ఆకర్షణలు లేని ఈ స్టార్ మా పోగ్రామ్ మునుపటిలా భారీ టీఆర్పీలు దక్కించుకోగలదా?
This post was last modified on September 7, 2020 8:28 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…