బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు నిన్న విడుదలైంది. చిన్న సినిమాలతో పోటీ భారీగా ఉన్నా కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద ధైర్యమే చేశాడు. దీని కోసం ఏకంగా నిర్మాతగా మారి ఉన్నవి అమ్మేసి మరీ కోట్ల పెట్టుబడి పెట్టినట్టు పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన దగ్గర ప్రమోషన్లకు డబ్బులు లేవని, దయచేసి థియేటర్లకు రమ్మని దీనంగా వేడుకున్న వీడియో వైరలయ్యింది. కట్ చేస్తే బూట్ కట్ బాలరాజుకి ఓపెనింగ్స్ రాలేదు. ఒక్క అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మాత్రమే ఆడియన్స్ ని రప్పించింది కానీ మిగిలినవన్నీ సోసోగానే ఉన్నాయి.
తన సినిమాకొచ్చిన స్పందన చూసి సోహైల్ బాధ మరింత ఎక్కువయ్యింది. థియేటర్లలో జనం లేరు. టాక్ ఏమైనా ఆశాజనకంగా ఉందా అంటే అదీ అంతంతమాత్రమే. బిగ్ బాస్ టైంలో వేల మంది కామెంట్లతో తన పేరుని హోరెత్తించారని, మరిప్పుడు ఎందుకు సినిమా చూడరని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కానీ వాస్తవం చేదుగా ఉంటుంది. ప్రేక్షకులు జాలిపడి టికెట్లు కొనరు. తమ డబ్బులకు న్యాయం చేసే మ్యాటర్ మూవీలో ఉందంటే హీరో ఎవరని కూడా పట్టించుకోరు. బలగం కావొచ్చు హనుమాన్ అవ్వొచ్చు. స్పందించే విధానంలో ఎలాంటి భేదభావాలు ఉండవు. ఎన్నోసార్లు ఋజువైన సత్యమిది.
ఒకవేళ బూట్ కట్ బాలరాజుకి పాజిటివ్ టాక్ వస్తే మెల్లగా అయినా సరే జనం వస్తారు. కానీ అంత విషయం ఉందనే మాట రప్పించుకోవాలి. అంతే కానీ రండయ్యా రండమ్మా అంటే వినిపించుకోరు. బిగ్ బాస్ షో వేరు. టీవీలో, ఓటిటిలో ఫ్రీగా చూసే వ్యవహారం కాబట్టి దాని రీచ్ వేరే. పైగా రియాలిటీ షో ఫాలోయింగ్ ని సినిమాకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ప్రపంచంలో ఏ భాషలో బిగ్ బాస్ షో చూసినా ఇదే చరిత్ర ఉంటుంది. సో ఫైనల్ గా మనం ఎంచుకున్న కథలు, దర్శకుడి విషయంలో జాగ్రత్తగా ఉండకుండా కేవలం సింపతీ మీద పబ్లిక్ థియేటర్లకు వస్తారనుకోవడం అమాయకత్వం.
This post was last modified on February 3, 2024 10:40 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…