బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన బూట్ కట్ బాలరాజు నిన్న విడుదలైంది. చిన్న సినిమాలతో పోటీ భారీగా ఉన్నా కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద ధైర్యమే చేశాడు. దీని కోసం ఏకంగా నిర్మాతగా మారి ఉన్నవి అమ్మేసి మరీ కోట్ల పెట్టుబడి పెట్టినట్టు పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన దగ్గర ప్రమోషన్లకు డబ్బులు లేవని, దయచేసి థియేటర్లకు రమ్మని దీనంగా వేడుకున్న వీడియో వైరలయ్యింది. కట్ చేస్తే బూట్ కట్ బాలరాజుకి ఓపెనింగ్స్ రాలేదు. ఒక్క అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మాత్రమే ఆడియన్స్ ని రప్పించింది కానీ మిగిలినవన్నీ సోసోగానే ఉన్నాయి.
తన సినిమాకొచ్చిన స్పందన చూసి సోహైల్ బాధ మరింత ఎక్కువయ్యింది. థియేటర్లలో జనం లేరు. టాక్ ఏమైనా ఆశాజనకంగా ఉందా అంటే అదీ అంతంతమాత్రమే. బిగ్ బాస్ టైంలో వేల మంది కామెంట్లతో తన పేరుని హోరెత్తించారని, మరిప్పుడు ఎందుకు సినిమా చూడరని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కానీ వాస్తవం చేదుగా ఉంటుంది. ప్రేక్షకులు జాలిపడి టికెట్లు కొనరు. తమ డబ్బులకు న్యాయం చేసే మ్యాటర్ మూవీలో ఉందంటే హీరో ఎవరని కూడా పట్టించుకోరు. బలగం కావొచ్చు హనుమాన్ అవ్వొచ్చు. స్పందించే విధానంలో ఎలాంటి భేదభావాలు ఉండవు. ఎన్నోసార్లు ఋజువైన సత్యమిది.
ఒకవేళ బూట్ కట్ బాలరాజుకి పాజిటివ్ టాక్ వస్తే మెల్లగా అయినా సరే జనం వస్తారు. కానీ అంత విషయం ఉందనే మాట రప్పించుకోవాలి. అంతే కానీ రండయ్యా రండమ్మా అంటే వినిపించుకోరు. బిగ్ బాస్ షో వేరు. టీవీలో, ఓటిటిలో ఫ్రీగా చూసే వ్యవహారం కాబట్టి దాని రీచ్ వేరే. పైగా రియాలిటీ షో ఫాలోయింగ్ ని సినిమాకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ప్రపంచంలో ఏ భాషలో బిగ్ బాస్ షో చూసినా ఇదే చరిత్ర ఉంటుంది. సో ఫైనల్ గా మనం ఎంచుకున్న కథలు, దర్శకుడి విషయంలో జాగ్రత్తగా ఉండకుండా కేవలం సింపతీ మీద పబ్లిక్ థియేటర్లకు వస్తారనుకోవడం అమాయకత్వం.
This post was last modified on February 3, 2024 10:40 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…