Movie News

సందీప్ వంగాకు అంత టైం ఎక్కడిది

యానిమల్ బ్లాక్ బస్టర్ తో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో చర్చగా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మీద బాలీవుడ్ మీడియాలో వెరైటీ ప్రచారాలు జరుగుతున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఒక యాక్షన్ డ్రామా చెప్పాడని, గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలో షూటింగ్ మొదలుపెట్టొచ్చని వాటిలో మొదటిది. షారుఖ్ ఖాన్ తో చేతులు కలపనున్న కబీర్ సింగ్ డైరెక్టర్ అంటూ ఇంకో వర్గం పబ్లిసిటీ షురూ చేసింది. ఈ రెండూ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. సల్మాన్ ప్రస్తుతం పంజా ఫేమ్ విష్ణువర్ధన్ తో ది బుల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొత్త కథలు వినే పరిస్థితి దగ్గర్లో లేనట్టే.

ఇక షారుఖ్ ఖాన్ వరసగా ఒకే ఏడాదిలో మూడు సినిమాలు ఇచ్చేసరికి రెస్ట్ ,మోడ్ లోకి వెళ్ళిపోయాడు. త్వరలో గుడ్ న్యూస్ చెబుతా అంటున్నాడు కానీ ఎవరి కాంబో అనేది సస్పెన్స్ పెట్టాడు. సో ఏది వచ్చినా గాసిప్పే. సందీప్ వంగా విషయానికి వస్తే తనకు రెండు కీలక బాధ్యతలు ఉన్నాయి. ఒక యానిమల్ పార్క్ స్క్రిప్ట్ పూర్తి చేయడం. ప్రస్తుతం ప్రణయ్ వంగా టీమ్ ఆ బాధ్యత మీదే ఉంది. సందీప్ ఇచ్చిన సూచనల ఆధారంగా స్టోరీకి ఒక రూపం తెచ్చే పనిలో ఉందట. ఇక ప్రభాస్ స్పిరిట్ అనే మహాయజ్ఞం ముందుంది. డార్లింగ్ డేట్స్ కన్ఫర్మ్ కాక ముందే ఫైనల్ వెర్షన్ సిద్ధం చేయాలి.

ఈ రెండూ పూర్తి చేసేనాటికి 2026 దాటిపోవచ్చు. నెక్స్ట్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ టి సిరీస్ నిర్మాణంలో ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంది. ఒకవేళ సందీప్ వంగా కనక వీటి తర్వాత ఎవరైనా పెద్ద హీరోతో చేయాలనుకుంటే రెండే ఆప్షన్లు పెట్టుకున్నాడట. వాళ్ళు చిరంజీవి, పవన్ కళ్యాణ్. ముందు నుంచి వీరాభిమాని కావడంతో దాన్ని బయట పెట్టుకునే ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటాడు. సల్మాన్ లేదా షారుఖ్ నిజంగా పిలిచినా వాళ్ళు సందీప్ స్కూల్ కి అంత సులభంగా సెట్ కారు. రన్బీర్ కపూర్ తో వచ్చిన సింక్ బడా సీనియర్లతో కుదరటం కష్టం.

This post was last modified on February 3, 2024 8:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

22 minutes ago

బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

37 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

42 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

50 minutes ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

1 hour ago

అక్కర్లేని వివాదం ఎందుకు హృతిక్

భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…

2 hours ago