Movie News

సంక్రాంతి 2025 – సీనియర్ల పోటాపోటీ

ఏడాది సమయం ఉన్నప్పటికీ వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ మొదలయిపోయింది. మొన్న థియేటర్ల పంపకాల విషయంలో జరిగిన రచ్చ చూసి నిర్మాతలు సంవత్సరం ముందే అలర్టతున్నారు. రవితేజ ఈగల్ తప్పుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మొన్న పండగ కలెక్షన్లు మరింత తీవ్రంగా ప్రభావితం చెందేవి. హనుమాన్ విజేతగా నిలిచినా గుంటూరు కారం, నా సామిరంగ స్టామినాలను బాక్సాఫీస్ పూర్తిగా వాడుకోలేదు. ఇక 2025 బరిలో ముగ్గురు సీనియర్ హీరోలు కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. వాళ్ళలో అధికారికంగా చెప్పిన స్టార్ చిరంజీవి విశ్వంభర.

జనవరి 10 విడుదల చేస్తామని అఫీషియల్ గా ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. మెగాస్టార్ ఈ రోజు సెట్లలో జాయిన్ అయ్యారు. ఇటీవలే జరిగిన నా సామిరంగ సక్సెస్ మీట్ నాగార్జున వచ్చే సంక్రాంతికి కలుస్తానని చెప్పడం ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. అయితే శేఖర్ కమ్ములతో ధనుష్ తో చేస్తున్న మల్టీ స్టారర్ కోసమా లేక ప్లానింగ్ లో ఉన్న బంగార్రాజు 3ని ఉద్దేశించా అనేది చెప్పలేదు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో దిల్ రాజు ప్లాన్ చేస్తున్న ఎంటర్ టైనర్ ని ముందు జాగ్రత్తగా సంక్రాంతి విడుదల ట్యాగ్ తో అనౌన్స్ మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. కథ ఫైనల్ కాగానే చెప్పేస్తారు.

దీనికన్నా ముందు ప్రకటించిన శతమానం భవతి నెక్స్ట్ పేజీని దిల్ రాజు వేసవికి షిఫ్ట్ చేస్తారట. ఇక్కడిదాకా బాగానే ఉంది ఇంకా ఎవరెవరు వస్తారనేది వేచి చూడాలి. బాలకృష్ణ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ అంత ఆలస్యం కాకపోవచ్చు. భగవంత్ కేసరి లాగా దసరా పండక్కు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కాకపోతే భారీ చిత్రం కావడంతో ఆ టైంకంతా షూటింగ్ పూర్తి కావడం అనుమానమే. ఒకవేళ లేట్ అయితే మాత్రం రేసులో బాలయ్య కూడా తోడవుతారు. అప్పుడు పోటీ ఇంకా రసవత్తరంగా మారుతుంది. వాయిదాలు అలవాటైన ట్రెండ్ లో వీళ్ళలో ఎందరు మాట మీద ఉంటారో.

This post was last modified on February 2, 2024 3:25 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

3 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

6 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

7 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

7 hours ago