ఏడాది సమయం ఉన్నప్పటికీ వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ మొదలయిపోయింది. మొన్న థియేటర్ల పంపకాల విషయంలో జరిగిన రచ్చ చూసి నిర్మాతలు సంవత్సరం ముందే అలర్టతున్నారు. రవితేజ ఈగల్ తప్పుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మొన్న పండగ కలెక్షన్లు మరింత తీవ్రంగా ప్రభావితం చెందేవి. హనుమాన్ విజేతగా నిలిచినా గుంటూరు కారం, నా సామిరంగ స్టామినాలను బాక్సాఫీస్ పూర్తిగా వాడుకోలేదు. ఇక 2025 బరిలో ముగ్గురు సీనియర్ హీరోలు కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. వాళ్ళలో అధికారికంగా చెప్పిన స్టార్ చిరంజీవి విశ్వంభర.
జనవరి 10 విడుదల చేస్తామని అఫీషియల్ గా ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. మెగాస్టార్ ఈ రోజు సెట్లలో జాయిన్ అయ్యారు. ఇటీవలే జరిగిన నా సామిరంగ సక్సెస్ మీట్ నాగార్జున వచ్చే సంక్రాంతికి కలుస్తానని చెప్పడం ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. అయితే శేఖర్ కమ్ములతో ధనుష్ తో చేస్తున్న మల్టీ స్టారర్ కోసమా లేక ప్లానింగ్ లో ఉన్న బంగార్రాజు 3ని ఉద్దేశించా అనేది చెప్పలేదు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో దిల్ రాజు ప్లాన్ చేస్తున్న ఎంటర్ టైనర్ ని ముందు జాగ్రత్తగా సంక్రాంతి విడుదల ట్యాగ్ తో అనౌన్స్ మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. కథ ఫైనల్ కాగానే చెప్పేస్తారు.
దీనికన్నా ముందు ప్రకటించిన శతమానం భవతి నెక్స్ట్ పేజీని దిల్ రాజు వేసవికి షిఫ్ట్ చేస్తారట. ఇక్కడిదాకా బాగానే ఉంది ఇంకా ఎవరెవరు వస్తారనేది వేచి చూడాలి. బాలకృష్ణ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ అంత ఆలస్యం కాకపోవచ్చు. భగవంత్ కేసరి లాగా దసరా పండక్కు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కాకపోతే భారీ చిత్రం కావడంతో ఆ టైంకంతా షూటింగ్ పూర్తి కావడం అనుమానమే. ఒకవేళ లేట్ అయితే మాత్రం రేసులో బాలయ్య కూడా తోడవుతారు. అప్పుడు పోటీ ఇంకా రసవత్తరంగా మారుతుంది. వాయిదాలు అలవాటైన ట్రెండ్ లో వీళ్ళలో ఎందరు మాట మీద ఉంటారో.
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…
శివ, క్షణక్షణం, సత్య, రంగీలా లాంటి సినిమాలతో కల్ట్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫామ్ తగ్గిపోయిన…