ఒకవైపు షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతోందన్న ఆనందం, ఇంకోవైపు ఆగస్ట్ 15 ఖచ్చితంగా విడుదల చేయగలమో లేదోననే ఆందోళన మధ్య పుష్ప టీమ్ ఒత్తిడికి లోనవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చకూడదని, ఎంత రిస్క్ అయినా రేయి పగలు పని చేద్దామని అల్లు అర్జున్ సిద్ధంగా ఉండగా, ప్రతి షాటు పర్ఫెక్ట్ గా వస్తే తప్ప సంతృప్తి చెందని సుకుమార్ రెట్టింపు బరువు పడుతున్నా సరే తట్టుకుని మరీ కొనసాగిస్తున్నాడు. జగదీశ్ బెయిల్ మీద బయటికి రావడంతో కానిస్టేబుళ్ల పహారాలో తన మీద తీయాల్సిన సీన్లను వాయు వేగంతో పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.
కీలకమైన జాతర ఎపిసోడ్ లో జగదీశ్ పాత్ర కీలకంగా ఉంటుందట. అలా అని హడావిడిగా తీయడానికి ఉండదు. అయినా సరే వీలైనంత క్వాలిటీగా వచ్చేలా సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అవసరమైతే తన సీన్లు కొన్ని తీసేయాలని కూడా డిసైడ్ అయ్యారట. సమస్య ఏంటంటే ఒక ముఖ్యమైన ట్విస్టు జగదీశ్ మీద ఉంటుంది. దాన్ని మారిస్తే మొత్తం ఫ్లో దెబ్బ తింటుంది. అందుకే అదలాగే ఉంచి దాని కన్నా ముందు వచ్చే సీన్లను ట్రిమ్ చేసే అవకాశం గురించి టీమ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ఊహించని పరిణామాల వల్ల వచ్చిన ముప్పు.
చేతిలో ఉన్న ఆరు నెలలు పుష్ప 2 రన్నింగ్ రేస్ చేయాల్సిందే. ఏ మాత్రం వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలిసినా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మూకుమ్మడిగా ఆగస్ట్ 15ని లాగేసుకునేందుకు వేరే నిర్మాతలు కాచుకుని ఉన్నారు. పైగా నెట్ ఫ్లిక్స్ తో జరిగిన ఓటిటి అగ్రిమెంట్ లో ఈ డేట్ కి అనుగుణంగానే స్టీమింగ్ కి ఎంత గ్యాప్ ఇవ్వాలనేది రాసుకున్నారని డిజిటల్ వర్గాల భోగట్టా. ఒకవేళ అది మార్చాల్సి వస్తే భారీగా ఆఫర్ చేసిన మొత్తంలో కొంత కోత పడొచ్చట. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా ఐకాన్ స్టార్ అభిమానులు మాత్రం ఇంతకన్నా వెయిటింగ్ మావల్ల కాదని తేల్చి చెప్పేస్తున్నారు.
This post was last modified on February 1, 2024 10:44 pm
దేశ విదేశాల్లో అతి తక్కువ కాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న సీజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కు డిమాండ్ పెరిగింది. రాజకీయంగానే…
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో ఎక్కువ సినిమాలు హీరోయిన్ గా చేసినవాళ్లలో జయప్రద ముఖ్యులు. అప్పట్లో ఈ కలయికలో ఎన్నో…
తెలంగాణాలో ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కాకపోవడంతో ఏమి చేయాలో…
స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సర్వసాధారణం. దక్షిణాదిలో అత్యధిక శాతం దీన్ని కొడుకులకే పరిమితం చేస్తూ ఉంటారు.…
అధికారంలో ఉండగా తమదైన బెదిరింపులకు పాల్పడిన వైపీపీ... అదికారం కోల్పోయాక మరింత దిగజారుడు తనాన్ని బయటపెట్టుకుంటోంది. మహిళలపై నిత్యం అకృత్యాలకు పాల్పడుతున్న వైసీపీ…
నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి…