ప్రస్తుతం టాలీవుడ్లో అతి పెద్ద హీరో అంటే ప్రభాసే. దేశవ్యాప్తంగా అతడికి తిరుగులేని పాపులారిటీ ఉంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడతను. ఈ ఇమేజ్ను ఉపయోగించుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇప్పుడు ఓ మంచి పనికి ప్రభాస్ సాయం తీసుకుంది.
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు, ఈ దిశగా జనాల్లో అవగాహన పెంచేందుకు ఎంపీ సంతోష్ కుమార్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు కొంత కాలంగా. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సెలబ్రెటీలందరినీ భాగం చేసి జనాల్లో చైతన్యం తెచ్చాడు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభాస్తో కలిసి ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాయన. హైదరాబాద్ శివార్లలోని జిన్నారం మండలంలో ఓఅర్ఆర్ సమీపంలోని ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ చేయూత తీసుకుంది.
అక్కడ ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్పాడు. తన తండ్రి, దివంగత సూర్యనారాయణ రాజు పేరు మీద అర్బన్ పార్కు,అటవీ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ప్రభాస్ ముందుకొచ్చాడు. ఇందుకోసం ముందుగా 2 కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్.. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. ప్రభాస్ బాటలో మున్ముందు మరింతమంది టాలీవుడ్ స్టార్లు ప్రయాణించి అటవీ ప్రాంత అభివృద్ధికి చేయూత అందిస్తారని భావిస్తున్నారు.
This post was last modified on September 7, 2020 7:48 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…