రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నపుడు.. సినీ రంగంలోని వారంతా నంది అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించేది. వీటి ఎంపిక పకడ్బందీగా జరిగేది. అవార్డులు గెలుచుకున్న వాళ్ల ఆనందానికి అవధులు ఉండేవి కావు. నంది అవార్డుల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేవారు.
కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కథ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డులను పక్కన పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం దక్కలేదు. తర్వాత అవార్డులు ఇవ్వడమే మానేశారు. రెండు తెలుగు రాష్ట్రాల పాలకులకు నంది అవార్డుల కోసం సినీ పెద్దలు విన్నపాలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు.
అయితే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకే ఈ సినీ అవార్డులను పునరుద్ధరించడానికి అడుగుపడింది. అయితే ఇంతకుముందులా నంది అవార్డులు కాకుండా కొత్త పేరుతో పురస్కారాలు ఇవ్వబోతున్నారు. గత ఏడాది పరమపదించిన విప్లవ నేత, గాయకుడు, నటుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా సినీ అవార్డులు ఇవ్వబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటన చేశారు. త్వరలోనే అవార్డుల ప్రక్రియ మొదలవుతుందని ఆయన ప్రకటించారు.
విభజన తర్వాత ఆల్రెడీ నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో కొత్త పేరుతోనే అవార్డులు ఇవ్వక తప్పట్లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరును ఎంచుకున్నారు. మరి ఈ పురస్కారాల పట్ల మిగతా రాజకీయ పక్షాలు, సినీ జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on January 31, 2024 9:52 pm
రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
భారతదేశ చరిత్రలో ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 16)కు ఒక ప్రత్యేకత ఉండనుంది. సుదీర్ఘ విరామం తర్వాత లోక్ సభ…