ఊహించిన దానికన్నా చాలా పెద్ద స్థాయిలో ప్రభంజనం సృష్టించిన హనుమాన్ ప్రస్తుతం మూడు వందల కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. టాలీవుడ్ అతి పెద్ద సంక్రాంతి విజేతగా అవతరించిన ఈ విజువల్ వండర్ ని 3Dలో మళ్ళీ విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన దర్శకుడు ప్రశాంత్ వర్మ బృందం చాలా సీరియస్ గా చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు మొదలుపెట్టినట్టు సమాచారం. కొంత భాగం శాంపిల్ ని హైదరాబాద్ లోని ఒక మల్టీప్లెక్స్ లో వేసుకుని చూసి సంతృప్తి చెందారని సమాచారం. ఫుల్ వెర్షన్ దిశగా వర్క్ జరుగుతోందని యూనిట్ టాక్.
వినడానికి బాగానే ఉంది కానీ హనుమాన్ ని మళ్ళీ త్రిడి సాంకేతికలో చూసేందుకు ప్రేక్షకులు ఎంత మేరకు ఆసక్తి చూపిస్తారనే ప్రశ్నకు సమాధానం కష్టం. గతంలో ఆర్ఆర్ఆర్ కు వచ్చిన స్పందన తక్కువే. రెగ్యులర్ వెర్షన్ ని చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అయితే హనుమాన్ కేసు వేరు. ఇంటర్వెల్ బ్లాక్, తేజ సజ్జ తిరగబడి విలన్లను ఎదిరించే ఎపిసోడ్, క్లైమాక్స్ ఘట్టం ఇవన్నీ ఖచ్చితంగా 3Dలో కొత్త అనుభూతినిస్తాయి. కాకపోతే ఇప్పుడున్న టికెట్ రేట్లకు మళ్ళీ ఇంకో పాతిక ముప్పై రూపాయలు ఎక్కువ పెట్టి థియేటర్లకు జనాలు వస్తారా అనేది సస్పెన్స్.
ఏదైనా వీలైనంత త్వరగా చేస్తే బెటర్. ఫిబ్రవరి తర్వాత పెద్ద సినిమాల తాకిడి పెరుగుతుంది. మార్చిలో ఓటిటిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదున్నా హనుమాన్ ఇప్పుడే ప్రణాళిక వేసుకోవాలి. దానికి తగ్గట్టే నిర్మాత పలు ప్లాన్లు సిద్ధం చేసుకున్నారట. ఒకటి టికెట్ రేట్లను అయిదో వారం నుంచి తగ్గించడం. రెండోది ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సీన్లను అదనంగా జోడించడం. వీటికి కనక 3D తోడైతే మరోసారి చూసే ఆడియన్స్ సంఖ్య పెద్దదే ఉండొచ్చు. రెస్పాన్స్ ని బట్టి పెరుగుదల ఉంటుంది. ప్రమోషన్లు మాత్రం హనుమాన్ టీమ్ ఆపడం లేదు. యుఎస్ కి ప్రత్యేకంగా మూడు రోజుల టూర్ వేస్తున్నారు.
This post was last modified on January 31, 2024 2:36 pm
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…
``దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?``అంటూ.. తృణమూల్…
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…