ఫిబ్రవరి 8 విడుదల కాబోతున్న యాత్ర 2 కేవలం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని సినిమా ద్వారా హైలైట్ చేయడం కోసమేనని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ట్రైలర్ లో ఇచ్చిన ఎలివేషన్లకే మ్యాటర్ అర్థమైపోయింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరిగ్గా రెండు నెలల ముందు రిలీజ్ ప్లాన్ చేసింది కూడా ఈ కారణంగానే. దర్శకుడు మహి వి రాఘవ్ పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేస్తున్నారు కూడా. అయితే ప్రతిపక్ష పార్టీలు జనసేన టీడీపీ వద్ద ఇలాంటి ఆయుధం ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదు. అందుకే దానికి ఫ్యాన్స్ పూనుకుని పాత సినిమాని రీ రిలీజ్ కి సిద్ధం చేయబోతున్నారు.
ఒక రోజు ముందు ఫిబ్రవరి 7న కెమెరామెన్ గంగతో రాంబాబుని పునఃవిడుదల చేయబోతున్నారని సమాచారం. రీ రిలీజుల ట్రెండ్ ప్రస్తుతానికి తగ్గినప్పటికీ ఎలక్షన్ల వేడిలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతారని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ఓజి నిర్మిస్తున్న డివివి సంస్థనే రాంబాబు ప్రొడ్యూసర్ కావడం మరో సానుకూలాంశం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో తండ్రి కొడుకులుగా కోట శ్రీనివాసరావు – ప్రకాష్ రాజ్ పాత్రలను రాంబాబు క్యారెక్టర్ చెడుగుడు ఆడే విధానం ఓ రేంజ్ లో పేలింది. కొన్ని అభ్యంతరాల వల్ల ఒకటి రెండు సీన్లు తీసేయాల్సి వచ్చింది.
సో ఇలాంటి పొలిటికల్ హీట్ లో కెమెరామెన్ గంగతో రాంబాబు రావడం మంచి నిర్ణయమే. అప్పట్లో ఇది బ్లాక్ బస్టర్ కాలేదు కానీ కమర్షియల్ గా మంచి విజయమే అందుకుని. ముఖ్యంగా పూరి జగన్నాథ్ మార్కు సెటైర్లు థియేటర్లలో బాగా పేలాయి. ఇప్పుడున్న పరిస్థితికి ఇంకా బాగా అద్దం పట్టేలా ఏపీ రాజకీయాలు మారిపోవడంతో హాళ్లలో జనాలు ఈలలు కేకలు వేయడం ఖాయమంటున్నారు. జర్నలిజం, రాజకీయాలు, విద్యార్థులు బాధ్యత, పౌరుల రక్షణ ఇలా ఎన్నో అంశాల మీద చర్చించిన రాంబాబు మరి ఈ రిలీజ్ లో ఏమైనా సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.
This post was last modified on January 30, 2024 10:22 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…