ఇండియాలో కరోనా తీవ్రత అధికా స్థాయిలో ఉన్న నగరం ముంబయి. దేశం మొత్తంలో మహారాష్ట్రనే అత్యధిక కేసులున్న రాష్ట్రం కాగా.. నగరాల్లో ముంబయి టాప్లో ఉంది. అలాంటపుడు ముంబయి కేంద్రంగా నడిచే బాలీవుడ్లో సెలబ్రెటీలు కరోనా బారిన పడకుండా ఎలా ఉంటారు? ఈ వైరస్ బారిన పడి వాజిద్ ఖాన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అమితాబ్ బచ్చన్ సహా ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి యువ కథానాయకుడు అర్జున్ కపూర్ కూడా చేరాడు. అతను వైరస్ బాధితుడైనట్లు ఆదివారమే వెల్లడైంది. ఐతే ఈ విషయాన్ని అంతా మామూలుగానే చూశారు కానీ.. ఇంకొన్ని గంటల్లోనే మలైకా అరోరా సైతం వైరస్ బారిన పడ్డట్లు వెల్లడి కావడం ఆసక్తి రేకెత్తించింది.
మలైకా అరోరాకు సంబంధించిన కరోనా టెస్ట్ రిపోర్ట్ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇది ఆమె సోదరి అమృతా అరోరాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీని మీద ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఐతే ఎలాగూ విషయం బయటపడిపోవడంతో మలైకా తనకు కరోనా సోకిన విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. అర్జున్, మలైకాలకు అధికారికంగా అయితే ఏ సంబంధం లేదు.
కానీ సల్మాన్ సోదరుడైన తన భర్త అర్బాజ్ ఖాన్కు కొన్నేళ్ల కిందట విడాకులు ఇచ్చేసిన మలైకా.. అప్పట్నుంచి అర్జున్తోనే ఉంటోంది. విడాకులు ఇవ్వడానికి ముందే వీళ్లిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు వార్తలొచ్చాయి. విడాకుల తర్వాత కొంత కాలం ఈ బంధాన్ని దాచిన మలైకా.. ఆ తర్వాత ఓపెన్ అయిపోయింది.
ఇద్దరూ బయట చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒక ఫ్లాట్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్కు కరోనా అనగానే.. మలైకా కూడా వైరస్ బారిన పడ్డట్లు వెల్లడి కావడంతో వీరి బంధం గురించి మరోసారి గుసగుసలు మొదలయ్యాయి.
This post was last modified on September 7, 2020 1:36 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…