Movie News

స్లమ్ ఏరియాలో నాగ్ ధనుష్ మాఫియా

సాఫ్ట్ అండ్ ఎమోషనల్ కథలను తెరకెక్కిస్తాడని పేరున్న శేఖర్ కమ్ముల పూర్తిగా రూటు మార్చేశారు. ధనుష్ – నాగార్జున కాంబినేషన్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. 90 దశకంలో దేశం మొత్తాన్ని వణికించిన మాఫియా మూలాలు ముంబైలోని ధారవి అనే ప్రాంతంలో ఉన్నాయి. అంతర్జాతీయ పోలీసులను సైతం వణికించిన దావూద్ ఇబ్రహీం చరిత్ర ఇక్కడ మొదలయ్యిందే. ఇప్పటికీ ఆ మురికివాడలో కొన్ని లక్షల మంది ఇరుకు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

ఈ నేపధ్యాన్ని తీసుకుని శేఖర్ కమ్ముల ఇంటెన్స్ డ్రామాని రూపొందించారట. అయితే ఇదేమి దావూద్ కు సంబంధించిన కథ కాదు. కేవలం అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని స్వంతంగా అల్లుకున్న కల్పిత కథ. దీని కోసం పరిందా, ధారవి, సత్య, దుకాన్ లాంటి క్లాసిక్స్ మీద ప్రత్యేక రీసెర్చ్ చేశారట. ధనుష్ నాగార్జున పాత్రలకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా లీక్ కాలేదు. రష్మిక మందన్నకు మరోసారి పెర్ఫార్మన్స్ ఇచ్చే పాత్రే దక్కిందట. హీరోతో ఆడిపాడే రెగ్యులర్ స్టైల్ లో కాకుండా నటనను స్కోప్ ఉండేలా శేఖర్ కమ్ముల శ్రద్ధ తీసుకున్నారని తెలిసింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ధారావి టైటిల్ నే పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శేఖర్ కమ్ముల ఇప్పటిదాకా తీసిన చిత్రాల్లో సీరియస్ గా సాగేది ఒక్క అనామిక మాత్రమే. అది కూడా హిందీ మూవీ కహానికి సీన్ టు సీన్ రీమేక్ కావడంతో ప్రత్యేకంగా దాని ఫలితానికి ఈయన్ని బాధ్యత అనలేం. కానీ ఈసారి మాత్రం లవ్ స్టోరీలు, కాలేజీ కుర్రకారు స్టోరీలు కాకుండా గాఢత ఉన్న నేపథ్యం ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ ఏడాది సాధ్యపడకపోతే 2025 సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున సంకల్పమట.

This post was last modified on January 30, 2024 3:11 pm

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

37 minutes ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

1 hour ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

2 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

2 hours ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

2 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

3 hours ago