ప్రతినాయకుడిగా ఎన్ని పాత్రలు చేసినా ఛత్రపతిలో ప్రభాస్ ని రెచ్చగొట్టే కాట్రాజుగా నటించిన సుప్రీత్ ప్రేక్షకుల మనసులో అలాగే గుర్తుండిపోయాడు. స్టార్ హీరోల సినిమాల్లో చెప్పుకోదగ్గ వేషాలు వేసినప్పటికీ మళ్ళీ ఆ స్థాయి గుర్తింపు రాలేదు. గత కొంత కాలంగా కనిపించడం కూడా తగ్గించేశాడు. కారణమేంటయ్యా అంటే ఇతను దర్శకత్వం చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడానికట. దీని గురించి ఇండస్ట్రీ వర్గాల్లో గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన రాలేదు. అలాని సుప్రీత్ ఆషామాషీ డెబ్యూ చేయడం లేదని సమాచారం.
ఏకంగా న్యాచురల్ స్టార్ నానిని ఒప్పించినట్టు తెలుస్తోంది. డివివి లేదా యువి ఎవరో ఒకరు ఈ ప్రాజెక్టుని తెరకెక్కించే అవకాశముందని ఇన్ సైడ్ టాక్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది కానీ దసరా, సరిపడా శనివారంలకు పూర్తి భిన్నంగా అనిపించే సరికొత్త ట్రీట్ మెంట్ తో కథ రాసుకున్నాడట. నాని లిస్టులో సుప్రీత్ కన్నా ముందు బలగం వేణు ఉన్నాడు. ఎల్లమ్మ వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. నిర్మాత దిల్ రాజు, నానిలకు ఫైనల్ వెర్షన్ నచ్చితే ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనేది నిర్ణయిస్తారు. కానీ సుప్రీత్ దీనికన్నా అడ్వాన్స్ గా ఉన్నాడట.
ఇది నిజమైతే మాత్రం సుప్రీత్ ది పెద్ద అదృష్టం అనుకోవాలి. నాని లాంటి మార్కెట్ ఉన్న హీరో డెబ్యూకి దొరకడం అంటే మాటలు కాదు. అయితే న్యాచురల్ స్టార్ డెసిషన్ ఎవరి వైపు ఉంటుందనేది వేచి చూడాలి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కూడా లైన్ లో ఉన్నాడు. ఆ మధ్య స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నానని చెప్పాడు. సరిపోదా శనివారం వేసవిలోగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆలోగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనేది నాని ఆలోచన. వరస క్రమం కొంచెం అటుఇటు అయినా ఇవన్నీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినవేనని వినిపిస్తోంది. చూడాలి మరి ముందువరసలో ఎవరుంటారో.
This post was last modified on January 30, 2024 11:05 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…