మొత్తానికి బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలైపోయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వాళ్లే ఈ షోలో కంటెస్టెంట్లుగా తేలారు. దీన్ని బట్టి బిగ్ బాస్ నిర్వాహకులే ఉద్దేశపూర్వకంగా లీక్స్ ఇచ్చారేమో అనిపిస్తోంది. ఐతే ఇది ప్రతి సీజన్ ముంగిటా ఉండేదే.
ఆ సంగతలా ఉంచితే గత మూడు సీజన్లతో పోలిస్తే పార్టిసిపెంట్లు ఏమంత ఎగ్జైటింగ్గా కనిపించట్లేదన్నది ముందు నుంచి వినిపిస్తున్న విమర్శ. షోలో పాల్గొంటున్న వారిలో బయట సూపర్ పాపులారిటీ అయితే ఎవరికీ లేదు. కాకపోతే నోయల్, కరాటే కళ్యాణి, టీవీ9 దేవి, అమ్మ రాజశేఖర్, మోనాల్ గజ్జర్ లాంటి వాళ్లు షోకు కావాల్సిన మసాలా అందిస్తారని అంచనా వేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ గంగవ్వను షోలోకి తీసుకోవడం భిన్నమైన ఎత్తుగడే.
ఐతే పార్టిసిపెంట్ల జాబితా చూస్తే వాళ్లను చూసి షో పట్ల ఆసక్తి పెంచుకునే పరిస్థితి అయితే లేదు. వాళ్లకు సొంతంగా ఉన్న పాపులారిటీ తక్కువ. ఈ షోలో వాళ్లు తమ ప్రత్యేకతను చాటుకుని పాపులారిటీ తెచ్చుకోవాలి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో వారి ప్రవర్తన, ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూడాలి. అదే సమయంలో రకరకాల ఎత్తుగడలు, గేమ్లు, మలుపులతో షోను ఎగ్జైటింగ్గా మార్చాల్సిన బాధ్యత నిర్వాహకుల మీదా ఉంది.
ఈ విషయంలో తొలి రోజు బాగానే ఆసక్తి రేకెత్తించగలిగారు. పార్టిసిపెంట్ల పరిచయం, నాగ్ హోస్టింగ్, గ్రాండియర్ ఆకట్టుకున్నాయి. అలాగే తొమ్మిదవ, పదవ పార్టిసిపెంట్లుగా వచ్చిన సయ్యద్ సోహైల్, అరియానా గ్లోరీలను నేరుగా హౌస్లోకి పంపకుండా తొలి రోజే సీక్రెట్ రూమ్లోకి పంపడం ద్వారా నాగ్ గేమ్ మొదలుపెట్టాడు. ఈ ట్విస్టుతో మొదలైన గేమ్ సోమవారం నుంచి ఎలా సాగుతుందో చూడాలి.
This post was last modified on September 7, 2020 2:40 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…