ఇంకా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ తేలలేదు. ఇంకో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ఉంటుందో క్లారిటీ రాలేదు. అలాంటిది రామ్ చరణ్ చేయబోయే 17వ సినిమా గురించి డిస్కషన్ రావడం అంటే విచిత్రమే. అది కూడా సుకుమార్ దర్శకత్వంలో. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ ని రిపీట్ చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతోంది కానీ పుష్ప వల్ల ఏళ్లకేళ్లు కరిగిపోవడంతో సాధ్యపడలేదు. సుకుమార్ దగ్గర చరణ్ కోసం ఒక కథ ఉన్న మాట వాస్తవమే కానీ అదింకా పూర్తి స్క్రిప్ట్ రూపంలోకి మారలేదు. చాలా టైం అయితే పడుతుంది.
ముందు రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ విడుదలవ్వాలి. సెప్టెంబర్ అంటున్నారు కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వగైరాలకు కనీసం ఏడాదిన్నర కావాలని ముందే మాట్లాడుకున్నారట. అంటే 2026లో తప్ప ముందే వచ్చే ఛాన్స్ లేదు. ఈలోగా పుష్ప 2 నుంచి సుకుమార్ పూర్తిగా ఫ్రీ అయ్యి ఉంటారు. అప్పటికంతా ఫైనల్ వెర్షన్ సిద్ధం చేస్తే మంచిదే. ఇంకో ట్విస్టు ఏంటంటే పుష్ప 3 ఆలోచన కూడా సీరియస్ గా జరుగుతోందట. ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు కానీ బన్నీ ఆసక్తిగానే ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు.
సో ఆర్సి 17 గురించి ఇప్పుడప్పుడే చర్చ వర్కౌట్ కాదు. సుకుమార్ నిజంగా చరణ్ తోనే చేస్తాడా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది తెలియాలి. పుష్ప 1 రిలీజైన కొత్తలో విజయ్ దేవరకొండతో ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్టుని కొత్త నిర్మాతతో అనౌన్స్ చేశారు కానీ తర్వాత దాన్ని డ్రాప్ చేశారు. తిరిగి పట్టాలు ఎక్కించే ప్రయత్నం జరుగుతోందన్నారు కానీ ఆ సూచనలైతే లేవు. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ఇంటర్నేషనల్ ఇమేజ్ వల్ల చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేయలేకపోతున్న పరిస్థితి వచ్చింది. ఆచి తూచి అడుగులు వేయడం వల్ల ఫ్యాన్స్ కి విపరీతమైన ఎదురుచూపులు తప్పవు.
This post was last modified on January 28, 2024 4:27 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…