ఇంకా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ తేలలేదు. ఇంకో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ఉంటుందో క్లారిటీ రాలేదు. అలాంటిది రామ్ చరణ్ చేయబోయే 17వ సినిమా గురించి డిస్కషన్ రావడం అంటే విచిత్రమే. అది కూడా సుకుమార్ దర్శకత్వంలో. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ ని రిపీట్ చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతోంది కానీ పుష్ప వల్ల ఏళ్లకేళ్లు కరిగిపోవడంతో సాధ్యపడలేదు. సుకుమార్ దగ్గర చరణ్ కోసం ఒక కథ ఉన్న మాట వాస్తవమే కానీ అదింకా పూర్తి స్క్రిప్ట్ రూపంలోకి మారలేదు. చాలా టైం అయితే పడుతుంది.
ముందు రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ విడుదలవ్వాలి. సెప్టెంబర్ అంటున్నారు కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వగైరాలకు కనీసం ఏడాదిన్నర కావాలని ముందే మాట్లాడుకున్నారట. అంటే 2026లో తప్ప ముందే వచ్చే ఛాన్స్ లేదు. ఈలోగా పుష్ప 2 నుంచి సుకుమార్ పూర్తిగా ఫ్రీ అయ్యి ఉంటారు. అప్పటికంతా ఫైనల్ వెర్షన్ సిద్ధం చేస్తే మంచిదే. ఇంకో ట్విస్టు ఏంటంటే పుష్ప 3 ఆలోచన కూడా సీరియస్ గా జరుగుతోందట. ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు కానీ బన్నీ ఆసక్తిగానే ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు.
సో ఆర్సి 17 గురించి ఇప్పుడప్పుడే చర్చ వర్కౌట్ కాదు. సుకుమార్ నిజంగా చరణ్ తోనే చేస్తాడా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది తెలియాలి. పుష్ప 1 రిలీజైన కొత్తలో విజయ్ దేవరకొండతో ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్టుని కొత్త నిర్మాతతో అనౌన్స్ చేశారు కానీ తర్వాత దాన్ని డ్రాప్ చేశారు. తిరిగి పట్టాలు ఎక్కించే ప్రయత్నం జరుగుతోందన్నారు కానీ ఆ సూచనలైతే లేవు. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ఇంటర్నేషనల్ ఇమేజ్ వల్ల చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేయలేకపోతున్న పరిస్థితి వచ్చింది. ఆచి తూచి అడుగులు వేయడం వల్ల ఫ్యాన్స్ కి విపరీతమైన ఎదురుచూపులు తప్పవు.
This post was last modified on January 28, 2024 4:27 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…