ఏజెంట్ వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పటిదాకా అఖిల్ కొత్త సినిమా మొదలుకాలేదు. కనీసం ప్రకటన లేదు. అప్పుడప్ప్పుడు బయట కనిపించడం తప్ప మీడియాతో మాట్లాడుతున్న దాఖలాలు కూడా లేవు. ఇటీవలే అఖిల్ బెంగళూరులో జరిగిన సలార్ పార్టీలో చేతికి గాయంతో ప్రత్యక్షమైన అందరినీ ఆశ్చర్యపరచడం తప్ప ఎలాంటి అప్ డేట్ లేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆల్రెడీ ప్యాన్ ఇండియా మూవీ లాకైన సంగతి తెలిసిందే. ధీరా అనే టైటిల్ అనుకున్నారట. కానీ ఎదురు చూసే కొద్దీ లేట్ అవుతూనే ఉంది.
దీనికి కారణమేంటయ్యా అని ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిశాయి. మొదటిది బడ్జెట్. అఖిల్ కు పెద్ద మార్కెట్ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో వంద కోట్ల దాకా రెడీ అయ్యారట. అయితే సబ్జెక్టు ఇంకా ఎక్కుడ డిమాండ్ చేస్తుండటంతో భాగస్వామిగా హోంబాలే ఫిలిమ్స్ ని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఆల్మోస్ట్ ఒప్పందం కుదిరిందని, అఖిల్ ప్రభాస్ ఈవెంట్ కి హాజరు వెనుక అసలు గుట్టు ఇదేనని తెలిసింది. ఇది గేమ్స్ అఫ్ థ్రోన్స్ తరహాలో జానపదం, ఫాంటసీ అన్నీ మిక్స్ చేసి విజువల్ ట్రీట్ గా రూపొందిస్తారని టాక్. ఇదే యూవీ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తోంది.
రెండు కథలు వేరు అయినప్పటికీ స్కేల్, బడ్జెట్ పరంగా సారూప్యతలు ఉండటంతో అఖిల్ స్క్రిప్ట్ ని మరింత పక్కాగా తీర్చిదిద్దే ఉద్దేశంతో లేట్ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని ముఖ్యమైన పాత్రలకు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు అవసరం ఉండటంతో ఆ దిశగా పలువురితో డిస్కషన్స్ చేస్తున్నట్టు వినికిడి. సో అఖిల్ 6 ఎప్పుడు మొదలైనా 2025 సమ్మర్ లో లేదా ఏడాది చివర్లో వస్తుంది. అంతకన్నా ముందు ఛాన్స్ లేనట్టే. కాకపోతే అఖిల్ మరీ ఓవర్ గ్యాప్ తీసుకుంటున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. డిజాస్టర్స్ వచ్చినంత మాత్రాన ఇంత వెయిటింగ్ గేమ్ ఆడకూడదని కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on January 28, 2024 2:27 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…