ఏజెంట్ వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఇప్పటిదాకా అఖిల్ కొత్త సినిమా మొదలుకాలేదు. కనీసం ప్రకటన లేదు. అప్పుడప్ప్పుడు బయట కనిపించడం తప్ప మీడియాతో మాట్లాడుతున్న దాఖలాలు కూడా లేవు. ఇటీవలే అఖిల్ బెంగళూరులో జరిగిన సలార్ పార్టీలో చేతికి గాయంతో ప్రత్యక్షమైన అందరినీ ఆశ్చర్యపరచడం తప్ప ఎలాంటి అప్ డేట్ లేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆల్రెడీ ప్యాన్ ఇండియా మూవీ లాకైన సంగతి తెలిసిందే. ధీరా అనే టైటిల్ అనుకున్నారట. కానీ ఎదురు చూసే కొద్దీ లేట్ అవుతూనే ఉంది.
దీనికి కారణమేంటయ్యా అని ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిశాయి. మొదటిది బడ్జెట్. అఖిల్ కు పెద్ద మార్కెట్ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో వంద కోట్ల దాకా రెడీ అయ్యారట. అయితే సబ్జెక్టు ఇంకా ఎక్కుడ డిమాండ్ చేస్తుండటంతో భాగస్వామిగా హోంబాలే ఫిలిమ్స్ ని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఆల్మోస్ట్ ఒప్పందం కుదిరిందని, అఖిల్ ప్రభాస్ ఈవెంట్ కి హాజరు వెనుక అసలు గుట్టు ఇదేనని తెలిసింది. ఇది గేమ్స్ అఫ్ థ్రోన్స్ తరహాలో జానపదం, ఫాంటసీ అన్నీ మిక్స్ చేసి విజువల్ ట్రీట్ గా రూపొందిస్తారని టాక్. ఇదే యూవీ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తోంది.
రెండు కథలు వేరు అయినప్పటికీ స్కేల్, బడ్జెట్ పరంగా సారూప్యతలు ఉండటంతో అఖిల్ స్క్రిప్ట్ ని మరింత పక్కాగా తీర్చిదిద్దే ఉద్దేశంతో లేట్ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని ముఖ్యమైన పాత్రలకు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు అవసరం ఉండటంతో ఆ దిశగా పలువురితో డిస్కషన్స్ చేస్తున్నట్టు వినికిడి. సో అఖిల్ 6 ఎప్పుడు మొదలైనా 2025 సమ్మర్ లో లేదా ఏడాది చివర్లో వస్తుంది. అంతకన్నా ముందు ఛాన్స్ లేనట్టే. కాకపోతే అఖిల్ మరీ ఓవర్ గ్యాప్ తీసుకుంటున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. డిజాస్టర్స్ వచ్చినంత మాత్రాన ఇంత వెయిటింగ్ గేమ్ ఆడకూడదని కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on January 28, 2024 2:27 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…