టిల్లు స్క్వేర్ మార్చి 29 విడుదలను ప్రకటించడం, ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 దాదాపు లాకైపోవడం దేవర చుట్టూ ఉన్న సస్పెన్స్ ని పూర్తిగా తీసేశాయి. అభిమానులు, ప్రేక్షకులు అనుమానపడినట్టే వాయిదా పడిన సంగతి ఖరారైపోయింది. ఇక అందరి చూపు తర్వాత ఏ డేట్ కి వస్తుందనే దాని మీద వెళ్తోంది. ముందు చేతిలో ఉన్న ఆప్షన్లు ఏంటో చూద్దాం. ఈ వేసవికి సాధ్యపడదు. సమ్మర్ జూలై దాకా ఉన్నా అప్పటికంతా సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయనే గ్యారెంటీ లేదు. సైఫ్ పూర్తిగా కోలుకోవాలి. దానికన్నా ముందు అనిరుద్ రవిచందర్ తన పనిని వేగంగా పూర్తి చేసేలా రంగంలోకి దిగాలి.
ఆగస్ట్ లో పుష్ప 2 ది రూల్ ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని ఎప్పుడో అనౌన్స్ చేసింది. ఇదే మాట మీద ఉండటం డౌటేనని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే నిజమైతే ఈ స్లాట్ ని తీసుకోవడం మంచిదే. సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ తేవాలని నిర్మాత దిల్ రాజు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సాధ్యపడకపోతే అక్టోబర్ గాంధీ జయంతితో మొదలుపెట్టి దసరా సెలవుల దాకా లాంగ్ సీజన్ వైపు కన్నేస్తున్నారు. దర్శకుడు శంకర్ చెబితే తప్ప ప్రకటన ఇవ్వడానికి లేదు. నవంబర్ ప్యాన్ ఇండియా సినిమాలకు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి దేవర దాన్ని లైట్ తీసుకోవాలి.
ఇక మిగిలింది డిసెంబర్. సలార్ లాగే ది రాజా డీలక్స్ ని క్రిస్మస్ కానుకగా తేవాలని ప్రభాస్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 2025 సంక్రాంతికి విశ్వంభర లాంటి భారీ చిత్రాలు లాక్ చేసుకున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచన చేయడం లేదు. ఇక్కడ చెప్పుకునే మూడు స్లాట్స్ లో దేవరకు అనుకూలంగా ఏది ఉంటుందనేది దర్శకుడు కొరటాల శివ ఫస్ట్ కాపీని ఎప్పుడు సిద్ధం చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఏప్రిల్ 5 రావాలని దేవర శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తప్పుకుంది. ఇప్పుడిది పెద్ద సవాల్ నే తారక్ టీమ్ ముందు పెట్టింది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…