రెండు వారాలకే రెండు వందల పదమూడు కోట్ల గ్రాస్ వచ్చిందని అధికారికంగా చెప్పుకున్న గుంటూరు కారం హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. ప్రకటనలు పెద్దగా రావడం లేదు. ట్విట్టర్ హ్యాండిల్ లో థియేటర్ ఫోటోలతో మేనేజ్ చేస్తున్నారు కానీ వసూళ్లు బాగా నెమ్మదించి ఫైనల్ రన్ కు దగ్గరగా వెళ్తోందన్న మాట వాస్తవం. ఇప్పుడు చివరి ఓవర్ ఆడే టైం వచ్చేసింది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం మూడు రోజుల వీకెండ్ లో రెండు జాతీయ సెలవులు వస్తున్నాయి. ఏదైనా పికప్ లాంటిది జరగాలన్నా, కలెక్షన్ల పరంగా అద్భుతాలు చూడాలన్నా ఇప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంది.
ఫిబ్రవరి నుంచి అవకాశం ఉండదు. నిర్మాత బ్రేక్ ఈవెన్ గురించి చెబుతూ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారని ఆ మధ్య ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా లాభాలు వచ్చాయా నష్టాలు మిగిలాయా అనేది తేలాలంటే మాత్రం ఇంకో వారం రోజులు ఆగాలి. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ ఉంటుందన్న వార్తలు గట్టిగానే తిరుగుతున్నాయి. సలార్ కు కేవలం 28 రోజుల గ్యాప్ ని మైంటైన్ చేసిన ఈ ఓటిటి గుంటూరు కారంకి కూడా అదే ఒప్పందం చేసుకుందని ఇన్ సైడ్ టాక్. స్ట్రీమింగ్ కి ముందు రోజు వరకు అఫీషియల్ గా చెప్పరు కాబట్టి ఎదురు చూడాల్సిందే.
ట్రేడ్ టాక్ ప్రకారం నూటా ముప్పై రెండు కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన గుంటూరు కారం ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని ఉంటే ఈపాటికి లాభాల్లో అడుగు పెట్టేది. కానీ తగ్గిపోయిన షోలు పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అనూహ్యంగా ఏదైనా పెరుగుదల ఉండటం డౌటే. పైగా సక్సెస్ మీట్ చేయలేదు. ఓ ఇంటర్వ్యూ ఇచ్చేసి మహేష్ జర్మనీ వెళ్ళిపోయాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరిలతో ప్రమోషన్లు రన్ చేయడం కష్టం. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత త్రివిక్రమ్, తమన్ కు అసలు కెమెరా ముందుకే రాలేదు. మరి చివరి ఓవర్లో గుంటూరు కారం ఏమైనా సిక్సర్లు కొడుతుందేమో చూడాలి.
This post was last modified on January 25, 2024 3:16 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…