సంక్రాంతి నుంచి తప్పుకున్నందుకు గాను తమకు సోలో రిలీజ్ ఇవ్వాలని ఈగల్ నిర్మాతలు చేస్తున్న డిమాండ్ కథ క్లైమాక్స్ కు చేరేలా ఉందని ఫిలిం నగర్ టాక్. యాత్ర 2 వాయిదా సాధ్యం కాదని, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన సినిమా కాబట్టి మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తే మూడు నాలుగు నెలలు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మినహాయింపు ఇమ్మని కోరారట. పోటీ పరంగా అదేమీ ఇబ్బంది పెట్టేది కాకపోవడంతో ఈగల్ బృందానికి సమస్య లేదు. ఇక లాల్ సలామ్ గురించి భయపడాల్సింది లేదు. రజనీకాంత్ క్యామియో మినహాయిస్తే తెలుగు ఆడియన్స్ కి ఎలాంటి భయం లేదు.
ఎటొచ్చి ఊరు పేరు భైరవకోనతో చిక్కొచ్చి పడింది. ఇవాళ ఛాంబర్ మీటింగ్ లో దీని గురించే ప్రధానంగా చర్చించబోతున్నారని టాక్. మొన్న హనుమాన్ ని ఇలాగే తక్కువంచన వేయడం వల్ల గుంటూరు కారం ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో చూశాం. చాలా చోట్ల రెవిన్యూలు తీవ్రంగా ప్రభావితం చెందాయి. భైరవకోనకు ట్రైలర్ వచ్చాక బజ్ పెరిగింది. పాటలు బాగా వెళ్తున్నాయి. దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వం మీద మూవీ లవర్స్ కి నమ్మకముంది. ఈ నేపథ్యంలో విరూపాక్ష లాగా సంచలనం సృష్టించే అవకాశాలు కొట్టిపారేయలేం. ఈగల్ కు అదే టెన్షన్.
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఎప్పుడో తేదీని లాక్ చేసుకున్న ఊరి పేరు భైరవకోనని పోస్టు పోన్ చేయమని కోరటం న్యాయం కాదని నిర్మాతలు భావిస్తున్నారట. పైగా దగ్గరలో ఏ డేట్ ఖాళీ లేదు. పోనీ దేవర డ్రాప్ అయితే ఏప్రిల్ 5 తీసుకుందామా అంటే దాని మీద ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ కన్నేశాయి. ఈ నేపథ్యంలో చర్చలు వాడివేడిగా ఉండే అవకాశం లేకపోలేదు. తమను సంప్రదించుకుండానే ఈగల్ కి హామీ ఇచ్చారని హీరో సందీప్ కిషన్ స్వయంగా చెప్పడం కొత్త ట్విస్టుని జోడించింది. చివరికి ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో సస్పెన్స్ గానే ఉంది.
This post was last modified on January 25, 2024 2:10 pm
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…
``దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?``అంటూ.. తృణమూల్…
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…