ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకుడు శంకర్ దేవర గురించి వస్తున్న వార్తలు చూసి గేమ్ ప్లాన్ మారుస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఏప్రిల్ 5 విడుదల కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సమయం సరిపోదనే ఉద్దేశంతో వాయిదా తప్పదనే దిశగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి పాలై చిన్న సర్జరీతో ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోవడం సమస్యని మరింత జటిలం చేసింది. ఎప్పటి నుంచి జాయిన్ అవుతాడనే దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. సైఫ్ స్వయంగా చెబితే తప్ప దేవర టీమ్ సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
దీన్ని శంకర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. ఒకవేళ దేవర కనక నిజంగా తప్పుకునే పనైతే భారతీయుడు 2ని అదే డేట్ కి తీసుకొస్తే ఎలా ఉంటుందనే దిశగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ముందు అనుకున్న డేట్ అయితే ఏప్రిల్ 12. కానీ ఇప్పుడు పెద్ద వీకెండ్ ఖాళీ అవుతోంది కాబట్టి ఆ స్థానాన్ని తాము తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో లైకా సంస్థ ప్రతినిధులతో సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నారు. ఇది తేలాలంటే ముందు దేవర అనౌన్స్ మెంట్ రావాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి పుకార్లు వచ్చినా స్పందించే ఉద్దేశం కొరటాల బృందంలో లేదు.
ఎందుకైనా మంచిదని భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చూస్తున్న నిర్మాత దిల్ రాజుకి సహకరించాలంటే ముందు కమల్ హాసన్ సినిమాకు మోక్షం కలిగించాలి. పైగా శంకర్ చేతిలో ఇండియన్ 3 ఉంది. అది కూడా ఈ సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసే సంకల్పంతో ఉన్నారు శంకర్. నిజంగా దేవర డ్రాప్ అయినా దాని మీద ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ ఇప్పటికే కన్నేశాయి. చూస్తుంటే పరిణామాలు రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరంగా మారబోతున్నట్టు కనిపిస్తోంది.
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.…
బాలీవుడ్ మీద గట్టి దృష్టి పెట్టిన రష్మిక మందన్న అక్కడి నుంచి వచ్చిన అవకాశాలను అంత తేలికగా వదిలిపెట్టడం లేదు.…
పెద్దికి మూడో వారంలో మళ్ళీ పికప్ ఉంటుందని, కొత్త సీన్లు జోడించారు కాబట్టి మరోసారి మంచి నెంబర్లు చూడొచ్చని ఆశించిన…
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…