ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకుడు శంకర్ దేవర గురించి వస్తున్న వార్తలు చూసి గేమ్ ప్లాన్ మారుస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఏప్రిల్ 5 విడుదల కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సమయం సరిపోదనే ఉద్దేశంతో వాయిదా తప్పదనే దిశగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి పాలై చిన్న సర్జరీతో ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోవడం సమస్యని మరింత జటిలం చేసింది. ఎప్పటి నుంచి జాయిన్ అవుతాడనే దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. సైఫ్ స్వయంగా చెబితే తప్ప దేవర టీమ్ సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
దీన్ని శంకర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. ఒకవేళ దేవర కనక నిజంగా తప్పుకునే పనైతే భారతీయుడు 2ని అదే డేట్ కి తీసుకొస్తే ఎలా ఉంటుందనే దిశగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ముందు అనుకున్న డేట్ అయితే ఏప్రిల్ 12. కానీ ఇప్పుడు పెద్ద వీకెండ్ ఖాళీ అవుతోంది కాబట్టి ఆ స్థానాన్ని తాము తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో లైకా సంస్థ ప్రతినిధులతో సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నారు. ఇది తేలాలంటే ముందు దేవర అనౌన్స్ మెంట్ రావాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి పుకార్లు వచ్చినా స్పందించే ఉద్దేశం కొరటాల బృందంలో లేదు.
ఎందుకైనా మంచిదని భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చూస్తున్న నిర్మాత దిల్ రాజుకి సహకరించాలంటే ముందు కమల్ హాసన్ సినిమాకు మోక్షం కలిగించాలి. పైగా శంకర్ చేతిలో ఇండియన్ 3 ఉంది. అది కూడా ఈ సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసే సంకల్పంతో ఉన్నారు శంకర్. నిజంగా దేవర డ్రాప్ అయినా దాని మీద ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ ఇప్పటికే కన్నేశాయి. చూస్తుంటే పరిణామాలు రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరంగా మారబోతున్నట్టు కనిపిస్తోంది.
This post was last modified on January 24, 2024 6:41 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…