ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న దర్శకుడు శంకర్ దేవర గురించి వస్తున్న వార్తలు చూసి గేమ్ ప్లాన్ మారుస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఏప్రిల్ 5 విడుదల కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సమయం సరిపోదనే ఉద్దేశంతో వాయిదా తప్పదనే దిశగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దానికి తోడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి పాలై చిన్న సర్జరీతో ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోవడం సమస్యని మరింత జటిలం చేసింది. ఎప్పటి నుంచి జాయిన్ అవుతాడనే దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. సైఫ్ స్వయంగా చెబితే తప్ప దేవర టీమ్ సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
దీన్ని శంకర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. ఒకవేళ దేవర కనక నిజంగా తప్పుకునే పనైతే భారతీయుడు 2ని అదే డేట్ కి తీసుకొస్తే ఎలా ఉంటుందనే దిశగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ముందు అనుకున్న డేట్ అయితే ఏప్రిల్ 12. కానీ ఇప్పుడు పెద్ద వీకెండ్ ఖాళీ అవుతోంది కాబట్టి ఆ స్థానాన్ని తాము తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో లైకా సంస్థ ప్రతినిధులతో సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నారు. ఇది తేలాలంటే ముందు దేవర అనౌన్స్ మెంట్ రావాలి. కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి పుకార్లు వచ్చినా స్పందించే ఉద్దేశం కొరటాల బృందంలో లేదు.
ఎందుకైనా మంచిదని భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చూస్తున్న నిర్మాత దిల్ రాజుకి సహకరించాలంటే ముందు కమల్ హాసన్ సినిమాకు మోక్షం కలిగించాలి. పైగా శంకర్ చేతిలో ఇండియన్ 3 ఉంది. అది కూడా ఈ సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసే సంకల్పంతో ఉన్నారు శంకర్. నిజంగా దేవర డ్రాప్ అయినా దాని మీద ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ ఇప్పటికే కన్నేశాయి. చూస్తుంటే పరిణామాలు రాబోయే రోజుల్లో చాలా ఆసక్తికరంగా మారబోతున్నట్టు కనిపిస్తోంది.
This post was last modified on January 24, 2024 6:41 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…