హిందూ పురాణ పురుషుల పాత్రలను సరిగ్గా వాడుకుంటే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో హనుమాన్ సినిమా రుజువు చేసింది. ఇందులో హనుమంతుడి పాత్రను అద్భుతంగా చూపించిన ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఐతే పురాణ పురుషుల పాత్రలను ఎలా చూపించకూడదో చెప్పడానికి గత ఏడాది ‘ఆదిపురుష్’ సినిమా నిదర్శనం. మన హీరో అని మొహమాటపడకుండా మాట్లాడుకుంటే రాముడి పాత్రలో ప్రభాస్ను కూడా అందులో సరిగా చూపించలేదు.
ఇక రావణుడి పాత్రలో సైఫ్ను చూపించిన విధానం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మిస్ కాస్టింగ్, చెత్త విజువలైజేషన్తో రామాయణాన్ని ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టాడు ఓం రౌత్. ఐతే ఇప్పుడు బాలీవుడ్లో మరో రామాయణానికి రంగం సిద్ధమైంది. ఆదిపురుష్ లాగా కాకుండా ఈ సినిమా బెటర్గా ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
దంగల్ దర్శకుడు నితీశ్ తివారి రూపొందించనున్న ఈ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ కనిపించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కాస్టింగ్ను ధ్రువీకరిస్తూ ట్వీట్ వేశాడంటే.. ఈ ముగ్గురే ముఖ్య పాత్రలను పోషిస్తున్నాడని ఖరారైంది. ఈ రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
ఈ మెగా ప్రాజెక్టులో టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కూడా భాగం కానున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు కూాడా ఆయన ఈ ప్రాజెక్టులో ఉన్నాడో లేదో చూడాలి. సరైన కాస్టింగ్ ఎంచుకోవడంతోనే నితీశ్ తివారి సగం సక్సెస్ అయిపోయాడు. ఇక ఆదిపురుష్ తరహా పిచ్చి విజువలైజేషన్ లేకుండా.. సహజంగా ఈ కథను తెరకెక్కిస్తే అద్భుతమైన ఫలితాన్ని అందుకోవడానికి అవకాశముంటుంది.
This post was last modified on January 23, 2024 8:56 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…