బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్లే అయ్యాయి. ఆ తర్వాత అతడికి ఉపశమనాన్ని ఇచ్చిన చిత్రం సలార్. ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. నిజానికి సలార్ సెప్టెంబర్ నెలాఖరులోనే రావాల్సినప్పటికీ.. అనివార్య కారణాలతో క్రిస్మస్ సీజన్లో రిలీజ్ అయింది.
డంకీ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులకు క్రిస్మస్.. హిట్ సెంటిమెంట్ గా మారింది. దీంతో ప్రభాస్ మరో చిత్రాన్ని క్రిస్మస్ కి తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రమే.. రాజాసాబ్.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీ మొత్తం పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ ను 2024 క్రిస్మస్ సీజన్లో విడుదల చేసే యోచన చేస్తోందట చిత్ర బృందం.
ముందు దసరాకు అనుకున్నప్పటికీ.. అప్పటికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయి ఉండడంతో క్రిస్మస్ సీజన్ పై దృష్టిసారించినట్లు సమాచారం. సెంటిమెంట్ గా కూడా ఇది కలిసొస్తుందని చూస్తున్నారట. డిసెంబర్ 20 డేట్ కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ తో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…