బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్లే అయ్యాయి. ఆ తర్వాత అతడికి ఉపశమనాన్ని ఇచ్చిన చిత్రం సలార్. ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. నిజానికి సలార్ సెప్టెంబర్ నెలాఖరులోనే రావాల్సినప్పటికీ.. అనివార్య కారణాలతో క్రిస్మస్ సీజన్లో రిలీజ్ అయింది.
డంకీ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులకు క్రిస్మస్.. హిట్ సెంటిమెంట్ గా మారింది. దీంతో ప్రభాస్ మరో చిత్రాన్ని క్రిస్మస్ కి తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రమే.. రాజాసాబ్.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీ మొత్తం పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ ను 2024 క్రిస్మస్ సీజన్లో విడుదల చేసే యోచన చేస్తోందట చిత్ర బృందం.
ముందు దసరాకు అనుకున్నప్పటికీ.. అప్పటికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయి ఉండడంతో క్రిస్మస్ సీజన్ పై దృష్టిసారించినట్లు సమాచారం. సెంటిమెంట్ గా కూడా ఇది కలిసొస్తుందని చూస్తున్నారట. డిసెంబర్ 20 డేట్ కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ తో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.
This post was last modified on January 23, 2024 6:35 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…