బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి మూడు సినిమాలు పెద్ద డిజాస్టర్లే అయ్యాయి. ఆ తర్వాత అతడికి ఉపశమనాన్ని ఇచ్చిన చిత్రం సలార్. ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. నిజానికి సలార్ సెప్టెంబర్ నెలాఖరులోనే రావాల్సినప్పటికీ.. అనివార్య కారణాలతో క్రిస్మస్ సీజన్లో రిలీజ్ అయింది.
డంకీ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులకు క్రిస్మస్.. హిట్ సెంటిమెంట్ గా మారింది. దీంతో ప్రభాస్ మరో చిత్రాన్ని క్రిస్మస్ కి తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రమే.. రాజాసాబ్.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీ మొత్తం పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ ను 2024 క్రిస్మస్ సీజన్లో విడుదల చేసే యోచన చేస్తోందట చిత్ర బృందం.
ముందు దసరాకు అనుకున్నప్పటికీ.. అప్పటికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయి ఉండడంతో క్రిస్మస్ సీజన్ పై దృష్టిసారించినట్లు సమాచారం. సెంటిమెంట్ గా కూడా ఇది కలిసొస్తుందని చూస్తున్నారట. డిసెంబర్ 20 డేట్ కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ తో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.
This post was last modified on January 23, 2024 6:35 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…