రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కులవర్ధన్ మృతి ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసు నేపధ్యంలోకి వెళితే.. మదనపల్లె శివార్లలో సోమవారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక మృతదేహం మరుసటి రోజు ఉదయం నిందితుడి ఇంటి సమీపంలోని నీళ్ల డ్రమ్ములో లభించింది..బాలికపై అత్యాచారం జరిగిందని, అనంతరం నిందితుడు నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేశాడని పోలీసులు ధృవీకరించారు. ఈ ఘోరం వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న కులవర్ధన్, ఈ రోజు సమీపంలోని చెరువులో శవమై తేలాడు.
మరోవైపు అత్యాచారం, హత్యకు గురైన ఏడేళ్ల బాలిక మృతదేహానికి ఆమె స్వగ్రామమైన రాగిమానుదిన్నెపల్లెలో ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…