రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కులవర్ధన్ మృతి ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసు నేపధ్యంలోకి వెళితే.. మదనపల్లె శివార్లలో సోమవారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక మృతదేహం మరుసటి రోజు ఉదయం నిందితుడి ఇంటి సమీపంలోని నీళ్ల డ్రమ్ములో లభించింది..బాలికపై అత్యాచారం జరిగిందని, అనంతరం నిందితుడు నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేశాడని పోలీసులు ధృవీకరించారు. ఈ ఘోరం వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న కులవర్ధన్, ఈ రోజు సమీపంలోని చెరువులో శవమై తేలాడు.
మరోవైపు అత్యాచారం, హత్యకు గురైన ఏడేళ్ల బాలిక మృతదేహానికి ఆమె స్వగ్రామమైన రాగిమానుదిన్నెపల్లెలో ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
This post was last modified on February 18, 2026 10:40 am
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…