తెలుగులో చేసింది మూడు సినిమాలే కానీ.. మన దగ్గర సమీరా రెడ్డి పాపులారిటీ తక్కువేమీ కాదు. స్వతహాగా తెలుగమ్మాయే అయినప్పటికీ ఎక్కువగా నార్త్లో పెరగడం, బాలీవుడ్లోనే తొలి అవకాశాలు అందుకోవడంతో ఆమెకు బాలీవుడ్ హీరోయిన్గానే ముద్ర పడింది.
అక్కడి నుంచి తెలుగులోకి వచ్చి అశోక్, జై చిరంజీవ, నరసింహుడు లాంటి భారీ చిత్రాల్లో నటించిందామె. ఆఫ్ ద సినిమా కూడా ఆమె నిరంతరం వార్తల్లో నిలిచేది ఒకప్పుడు. సినిమాలకు టాటా చెప్పేశాక పెళ్లి చేసుకుని తల్లి కూడా అయిన సమీరా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను నటించిన బాలీవుడ్ మూవీ చిత్రీకరణ సందర్బంగా చేదు అనుభవాల గురించి గుర్తు చేసుకుంది. లిప్ లాక్ చేయనందుకు తనను ఓ దర్శకుడు ఎలా బెదిరించాడో ఇందులో ఆమె వివరించింది.
ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా హీరోతో లిప్ లాక్ సీన్ చేయాలని దర్శకుడు తనకు చెప్పాడని.. కానీ ముందు తనకు కథ, తన పాత్ర వివరించినపుడు ఈ లిప్ లాక్ గురించి చెప్పలేదని.. ఇదే విషయమై అభ్యంతరపెడితే ఆ దర్శకుడు అడ్డం తిరిగాడు సమీరా వెల్లడించింది. ఆ సీన్ చేయకపోతే సినిమా నుంచి తప్పించాల్సి ఉంటుందని అతను బెదిరించినట్లు తెలిపింది.
అంతే కాక దాని కంటే ముందు చేసిన ‘ముసాఫిర్’ సినిమాలో లిప్ లాక్ ఉన్న విషయాన్ని ఆ దర్శకుడు గుర్తు చేశాడని.. అందులో చేసినపుడు మళ్లీ చేయడానికి అభ్యంతరమేంటి అని తేలిగ్గా మాట్లాడాడని.. ఈ విషయమై గొడవ జరిగిందని.. కానీ ఆ దర్శకుడు బెదిరించడంతో అయిష్టంగానే ఆ లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చిందని సమీరా చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడెవరు, సినిమా ఏది అనే విషయాలు మాత్రం సమీరా వెల్లడించలేదు.
This post was last modified on September 5, 2020 4:50 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…