సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ వెళ్ళాక దాని గురించి రకరకాల కథలు వచ్చాయి. రాజమౌళితో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం వెళ్లాడని, అక్కడేదో వర్క్ షాప్ జరుగుతుందని ఏదేదో అల్లేశారు. కట్ చేస్తే జక్కన్న ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. వరసగా రెండు రోజుల్లో గుంటూరు కారం, హనుమాన్ చూసేశారు. ఒకవేళ ప్రచారం జరిగిన వార్త నిజమే అయితే ఆయనా విదేశంలోనే ఉండాలి. అయితే అసలు కారణం వేరే ఉందట. డాక్టర్ హ్యారీ కొనిగ్ జర్మనీలో బాగా పాపులర్. బ్రెన్నెర్స్ పార్క్ హోటల్ అండ్ స్పాలో ప్రత్యేక కన్సల్టేషన్లు చేస్తుంటారు. చాలా ఖరీదైన వైద్యుడు.
గుంటూరు కారం కోసం గత మూడు నెలలుగా రెస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొని డాన్సులు ఫైట్లు చేసిన మహేష్ తన బాడీ ఫిట్ నెస్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల కోసం హ్యారీని కలుసుకున్నాడు. శారీరక దృఢత్వానికి సంబంధించిన ముఖ్యమైన సలహాలు, సూచనలు తీసుకుంటున్నాడు. షార్ట్ ట్రిప్ అయినప్పటికీ వీలైనంత గైడెన్స్ తీసుకుని దాన్ని తిరిగి వచ్చాక ఇంట్లో అమలు పరచబోతున్నాడు. రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడేదే. ఫైనల్ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటున్న నేపథ్యంలో ఉగాదికి ఓపెనింగ్ చేస్తారని టాక్.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. క్యాస్టింగ్ సంబంధించి ఎలాంటి లీక్స్ బయటికి రావడం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో ఇతర బాషా నటులు ఇందులో భాగం కాబోతున్నారు. ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి, మహేష్ లు స్వయంగా చెప్పే దాకా వీటికి సంబంధించిన స్పష్టత వచ్చేలా లేదు.
This post was last modified on January 23, 2024 6:58 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…