సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ వెళ్ళాక దాని గురించి రకరకాల కథలు వచ్చాయి. రాజమౌళితో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం వెళ్లాడని, అక్కడేదో వర్క్ షాప్ జరుగుతుందని ఏదేదో అల్లేశారు. కట్ చేస్తే జక్కన్న ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. వరసగా రెండు రోజుల్లో గుంటూరు కారం, హనుమాన్ చూసేశారు. ఒకవేళ ప్రచారం జరిగిన వార్త నిజమే అయితే ఆయనా విదేశంలోనే ఉండాలి. అయితే అసలు కారణం వేరే ఉందట. డాక్టర్ హ్యారీ కొనిగ్ జర్మనీలో బాగా పాపులర్. బ్రెన్నెర్స్ పార్క్ హోటల్ అండ్ స్పాలో ప్రత్యేక కన్సల్టేషన్లు చేస్తుంటారు. చాలా ఖరీదైన వైద్యుడు.
గుంటూరు కారం కోసం గత మూడు నెలలుగా రెస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొని డాన్సులు ఫైట్లు చేసిన మహేష్ తన బాడీ ఫిట్ నెస్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల కోసం హ్యారీని కలుసుకున్నాడు. శారీరక దృఢత్వానికి సంబంధించిన ముఖ్యమైన సలహాలు, సూచనలు తీసుకుంటున్నాడు. షార్ట్ ట్రిప్ అయినప్పటికీ వీలైనంత గైడెన్స్ తీసుకుని దాన్ని తిరిగి వచ్చాక ఇంట్లో అమలు పరచబోతున్నాడు. రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడేదే. ఫైనల్ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటున్న నేపథ్యంలో ఉగాదికి ఓపెనింగ్ చేస్తారని టాక్.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. క్యాస్టింగ్ సంబంధించి ఎలాంటి లీక్స్ బయటికి రావడం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో ఇతర బాషా నటులు ఇందులో భాగం కాబోతున్నారు. ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి, మహేష్ లు స్వయంగా చెప్పే దాకా వీటికి సంబంధించిన స్పష్టత వచ్చేలా లేదు.
This post was last modified on January 23, 2024 6:58 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…