Ashika Ranganath,, Nagarjuna in Naa Saami Ranga Movie Stills
హిట్టు కోసం తపించిపోతున్న అక్కినేని అభిమానులకు ఊరట కలిగేలా నా సామిరంగ విజయం సాధించింది. రెండు వారాలు పూర్తి కాకుండానే బ్రేక్ ఈవెన్ దాటేయడం నాగార్జున చాలా గ్యాప్ తర్వాత సాధించారు. ట్రేడ్ టాక్ ప్రకారం పద్దెనిమిది కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న నా సామిరంగ ఇప్పటికే ఆ మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టే కోటి లాభంలో ఉంది. గ్రాస్ కొంచెం అటుఇటుగా ముప్పై అయిదు కోట్లకు దగ్గరగా ఉందని సమాచారం. బంగార్రాజు తర్వాత సక్సెస్ లేక వైల్డ్ డాగ్, ఘోస్ట్ లు తీవ్రంగా నష్టపరడం నాగ్ ని విపరీతమైన ఆలోచనలో పడేసి నా సామిరంగను ఎంచుకునేలా చేసింది.
లెక్కల సంగతి ఓకే కానీ ఈ సినిమాని ఇంకా పెద్ద రేంజ్ లో ఊహించుకున్నారు నాగార్జున. బ్లాక్ బస్టర్ ని మించి ఆడుతుందని, సోగ్గాడే చిన్ని నాయనను అందుకుంటుందని ఆశించారు. కానీ ప్రాక్టికల్ గా జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే చాలా చోట్ల నెమ్మదించింది. ముఖ్యంగా నైజామ్, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో డ్రాప్ ఎక్కువగా ఉందని డిస్టిబ్యూటర్ల మాట. ఒకవేళ టాక్ కనక అలాగే కొనసాగి ఉంటే హనుమాన్ తర్వాత బెస్ట్ ఛాయస్ ఇదే కాబట్టి కనీసం వారం పది రోజులు హౌస్ ఫుల్ బోర్డులు ఉండేవని అభిప్రాయపడుతున్నారు. అయినా సరే వసూళ్లని తక్కువగా చూడటం లేదు.
ఒకవేళ నా సామిరంగలో అన్ని ఎలిమెంట్స్ ఇంకాస్త జాగ్రత్తగా బ్యాలన్స్ అయ్యుండి, పాటలు కనక వైరలయ్యే స్థాయిలో ఉంటే కింగ్ ర్యాంపేజ్ ఇంకో స్థాయిలో ఉండేదన్న మాట వాస్తవం. నాగ్ ప్రేమకథకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సెకండ్ హాఫ్ లో అల్లరి నరేష్ ఎపిసోడ్ మీదే ఎమోషన్ భారాన్ని తోసేయడంతో మిగిలిన అంశాలకు చోటు లేకుండా పోయింది. దీనికి తోడు కీరవాణి నేపధ్య సంగీతం ఎంత బాగా ఎలివేట్ చేసినా ఒకటి మినహాయించి పాటలు సోసో అనిపించుకోవడం దెబ్బ కొట్టింది. దీని ఫలితం సంతృప్తిపర్చడంతో ఇకపై కూడా నాగార్జున ప్రయోగాలకు స్వస్తి చెప్పి ఓన్లీ మాస్ అంటున్నారట.
This post was last modified on January 22, 2024 6:54 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…