టాలీవుడ్ సెలబ్రెటీల్లో చాలామంది కొత్త సినిమా రిలీజైనపుడు హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్కు వెళ్లి 8.45 షో చూస్తుంటారు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా అక్కడికెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం ఇష్టం. తన సన్నిహితుల సినిమాలు లేదంటే తన దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రిలీజైనపుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయనక్కడ సినిమా చూస్తుంటారు.
ఆ తర్వాత ట్విట్టర్లో షార్ట్ రివ్యూలు కూడా ఇస్తుంటారు. దర్శకుడిగా తిరుగులేని స్థాయికి ఎదిగాక కూడా రాజమౌళి ఐమాక్స్కు వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూడటం ఆపేయలేదు. ఐతే లాక్ డౌన్ వచ్చి అందుకు అవకాశం లేకుండా చేసింది.
గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయిన రాజమౌళి ఓటీటీ కంటెంట్ చూస్తున్నాడు. తాజాగా ఆయన ఓ కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాడు. రాజమౌళే కాదు.. ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి హోమ్ థియేటర్లో ఓ సినిమా చూశారు. అదే.. వి.
నిన్న రాత్రే ‘వి’ సినిమా అమేజాన్ ప్రైమ్లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తన ఇంట్లోని హోమ్ థియేటర్లో రాజమౌళి చూశాడు. ఆయనతో పాటు సినిమా చూసిన వాళ్ల సంఖ్య పెద్దదే. భార్య రమ రాజమౌళి, కొడుకు కార్తికేయ, కీరవాణి కొడుకులు కాలభైరవ, సింహా, జక్కన్నకు సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి.. ఇంకా పలువురు ‘వి’ సినిమా చూశారు. మొత్తం నంబర్ డబుల్ డిజిట్లోనే ఉంది. రాజమౌళికి నాని అంటే ఎంతో అభిమానం.
దాదాపుగా అతడి ప్రతి సినిమా చూస్తాడు. ఆరు నెలలుగా థియేటర్లు మూతబడి ఉండగా.. ఓటీటీల్లో నేరుగా కొన్ని చిన్న తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఐతే ‘వి’ ఇలా రిలీజవుతున్న మొదటి పెద్ద సినిమా. అందుకే జక్కన్న కుటుంబం సగటు ప్రేక్షకుల్లాగే ఆసక్తిగా ఈ సినిమా చూసింది. ఐతే ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. రాజమౌళి కూడా ట్విట్టర్లో రివ్యూ ఏమీ ఇవ్వకపోవడాన్ని బట్టి ఈ సినిమా ఆయనకూ నచ్చలేదని అర్థమవుతోంది.
This post was last modified on September 5, 2020 6:02 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…