టాలీవుడ్ సెలబ్రెటీల్లో చాలామంది కొత్త సినిమా రిలీజైనపుడు హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్కు వెళ్లి 8.45 షో చూస్తుంటారు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా అక్కడికెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం ఇష్టం. తన సన్నిహితుల సినిమాలు లేదంటే తన దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రిలీజైనపుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయనక్కడ సినిమా చూస్తుంటారు.
ఆ తర్వాత ట్విట్టర్లో షార్ట్ రివ్యూలు కూడా ఇస్తుంటారు. దర్శకుడిగా తిరుగులేని స్థాయికి ఎదిగాక కూడా రాజమౌళి ఐమాక్స్కు వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూడటం ఆపేయలేదు. ఐతే లాక్ డౌన్ వచ్చి అందుకు అవకాశం లేకుండా చేసింది.
గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయిన రాజమౌళి ఓటీటీ కంటెంట్ చూస్తున్నాడు. తాజాగా ఆయన ఓ కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాడు. రాజమౌళే కాదు.. ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి హోమ్ థియేటర్లో ఓ సినిమా చూశారు. అదే.. వి.
నిన్న రాత్రే ‘వి’ సినిమా అమేజాన్ ప్రైమ్లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తన ఇంట్లోని హోమ్ థియేటర్లో రాజమౌళి చూశాడు. ఆయనతో పాటు సినిమా చూసిన వాళ్ల సంఖ్య పెద్దదే. భార్య రమ రాజమౌళి, కొడుకు కార్తికేయ, కీరవాణి కొడుకులు కాలభైరవ, సింహా, జక్కన్నకు సన్నిహితుడైన నిర్మాత సాయి కొర్రపాటి.. ఇంకా పలువురు ‘వి’ సినిమా చూశారు. మొత్తం నంబర్ డబుల్ డిజిట్లోనే ఉంది. రాజమౌళికి నాని అంటే ఎంతో అభిమానం.
దాదాపుగా అతడి ప్రతి సినిమా చూస్తాడు. ఆరు నెలలుగా థియేటర్లు మూతబడి ఉండగా.. ఓటీటీల్లో నేరుగా కొన్ని చిన్న తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఐతే ‘వి’ ఇలా రిలీజవుతున్న మొదటి పెద్ద సినిమా. అందుకే జక్కన్న కుటుంబం సగటు ప్రేక్షకుల్లాగే ఆసక్తిగా ఈ సినిమా చూసింది. ఐతే ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. రాజమౌళి కూడా ట్విట్టర్లో రివ్యూ ఏమీ ఇవ్వకపోవడాన్ని బట్టి ఈ సినిమా ఆయనకూ నచ్చలేదని అర్థమవుతోంది.
This post was last modified on September 5, 2020 6:02 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…