కొన్నేళ్ల కిందటే టాలీవుడ్లోకి అడుగుపెట్టి మిడ్ రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి. గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన సిటీమార్ ఆయన తొలి చిత్రం. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించాయి. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అంతిమంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత శ్రీనివాసా వరుసగా వారియర్, కస్టడీ, స్కంద సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఇవి మూడు డిజాస్టర్లే అయ్యాయి. స్కంద బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ఓ హడావిడి చేశారు కానీ చివరికి అది కూడా డిజాస్టర్ అయింది. వరుసగా నాలుగు సినిమాలు తేడా కొడితే ఏ నిర్మాత అయిన నిలదొక్కుకోవడం కష్టమే. ఇంకో ఫ్లాప్ పడితే శ్రీనివాస పరిస్థితి అయోమయం అయ్యేది. అయితే ఆయన్ని సంక్రాంతి సినిమా నా సామి రంగ ఆదుకుంది.
అక్కినేని నాగార్జున పక్కా ప్లానింగ్ తో చేసిన ఈ సినిమా శ్రీనివాసా చిట్టూరికి తొలిసారిగా లాభాలు అందించింది. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు శ్రీనివాసా. ఆయన పెట్టిన బడ్జెట్ మొత్తం దాదాపుగా నాని థియేత్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేసింది. మిగతాదంతా లాభమే. రిలీజ్ తర్వాత మంచి రెవెన్యూ రావడంతో కొంచెం ఓవర్ ఫ్లోస్ రూపంలో ఆయనకు మరింత ఆదాయం వచ్చింది.
ఇంతకుముందు స్కంద లాంటి సినిమాలకు ఆయనకు బిజినెస్ బాగానే జరిగినా చివరికి బయ్యర్లను బయట పడేయడానికి చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది. నా సామి రంగ పరిమిత బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి కావడం.. రిలీజ్ ప్లానింగ్ పక్కాగా ఉండడం.. సంక్రాంతి సీజన్లో సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాగా ఆరడంతో శ్రీనివాసకు పెద్ద రిలీఫ్ దక్కినట్లు అయింది. ఈ ఊపులో ఆయన మరికొన్ని సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
This post was last modified on January 21, 2024 9:37 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…