కొన్నేళ్ల కిందటే టాలీవుడ్లోకి అడుగుపెట్టి మిడ్ రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి. గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన సిటీమార్ ఆయన తొలి చిత్రం. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించాయి. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అంతిమంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత శ్రీనివాసా వరుసగా వారియర్, కస్టడీ, స్కంద సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఇవి మూడు డిజాస్టర్లే అయ్యాయి. స్కంద బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ఓ హడావిడి చేశారు కానీ చివరికి అది కూడా డిజాస్టర్ అయింది. వరుసగా నాలుగు సినిమాలు తేడా కొడితే ఏ నిర్మాత అయిన నిలదొక్కుకోవడం కష్టమే. ఇంకో ఫ్లాప్ పడితే శ్రీనివాస పరిస్థితి అయోమయం అయ్యేది. అయితే ఆయన్ని సంక్రాంతి సినిమా నా సామి రంగ ఆదుకుంది.
అక్కినేని నాగార్జున పక్కా ప్లానింగ్ తో చేసిన ఈ సినిమా శ్రీనివాసా చిట్టూరికి తొలిసారిగా లాభాలు అందించింది. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు శ్రీనివాసా. ఆయన పెట్టిన బడ్జెట్ మొత్తం దాదాపుగా నాని థియేత్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేసింది. మిగతాదంతా లాభమే. రిలీజ్ తర్వాత మంచి రెవెన్యూ రావడంతో కొంచెం ఓవర్ ఫ్లోస్ రూపంలో ఆయనకు మరింత ఆదాయం వచ్చింది.
ఇంతకుముందు స్కంద లాంటి సినిమాలకు ఆయనకు బిజినెస్ బాగానే జరిగినా చివరికి బయ్యర్లను బయట పడేయడానికి చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది. నా సామి రంగ పరిమిత బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి కావడం.. రిలీజ్ ప్లానింగ్ పక్కాగా ఉండడం.. సంక్రాంతి సీజన్లో సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాగా ఆరడంతో శ్రీనివాసకు పెద్ద రిలీఫ్ దక్కినట్లు అయింది. ఈ ఊపులో ఆయన మరికొన్ని సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…