కొన్నేళ్ల కిందటే టాలీవుడ్లోకి అడుగుపెట్టి మిడ్ రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి. గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన సిటీమార్ ఆయన తొలి చిత్రం. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించాయి. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అంతిమంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత శ్రీనివాసా వరుసగా వారియర్, కస్టడీ, స్కంద సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఇవి మూడు డిజాస్టర్లే అయ్యాయి. స్కంద బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ఓ హడావిడి చేశారు కానీ చివరికి అది కూడా డిజాస్టర్ అయింది. వరుసగా నాలుగు సినిమాలు తేడా కొడితే ఏ నిర్మాత అయిన నిలదొక్కుకోవడం కష్టమే. ఇంకో ఫ్లాప్ పడితే శ్రీనివాస పరిస్థితి అయోమయం అయ్యేది. అయితే ఆయన్ని సంక్రాంతి సినిమా నా సామి రంగ ఆదుకుంది.
అక్కినేని నాగార్జున పక్కా ప్లానింగ్ తో చేసిన ఈ సినిమా శ్రీనివాసా చిట్టూరికి తొలిసారిగా లాభాలు అందించింది. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు శ్రీనివాసా. ఆయన పెట్టిన బడ్జెట్ మొత్తం దాదాపుగా నాని థియేత్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేసింది. మిగతాదంతా లాభమే. రిలీజ్ తర్వాత మంచి రెవెన్యూ రావడంతో కొంచెం ఓవర్ ఫ్లోస్ రూపంలో ఆయనకు మరింత ఆదాయం వచ్చింది.
ఇంతకుముందు స్కంద లాంటి సినిమాలకు ఆయనకు బిజినెస్ బాగానే జరిగినా చివరికి బయ్యర్లను బయట పడేయడానికి చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది. నా సామి రంగ పరిమిత బడ్జెట్లో, తక్కువ రోజుల్లో పూర్తి కావడం.. రిలీజ్ ప్లానింగ్ పక్కాగా ఉండడం.. సంక్రాంతి సీజన్లో సినిమా మంచి టాక్ తెచ్చుకుని బాగా ఆరడంతో శ్రీనివాసకు పెద్ద రిలీఫ్ దక్కినట్లు అయింది. ఈ ఊపులో ఆయన మరికొన్ని సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
This post was last modified on January 21, 2024 9:37 am
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…