Manchu Vishnu
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. ఈ ప్రాజెక్టు గురించి దశాబ్ద కాలం కిందటి నుంచి చెబుతూ వస్తోంది మంచు ఫ్యామిలీ. ఎట్టకేలకు గత ఏడాది ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. బడ్జెట్ 100 కోట్లకు పై మాటే.
ముఖేష్ కుమార్ సింగ్ అనే హిందీ దర్శకుడితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 600 మంది కాస్ట్ అండ్ క్రూతో న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడే కొన్ని నెలల పాటు మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ జరిపింది టీం. ప్రస్తుతం ఇండియాలోనే కొత్త షెడ్యూల్ జరుగుతోంది. దీంతో పాటే విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా చేయిస్తునారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది కల్పిత కథ కాదని.. చరిత్రలో జరిగిన విషయాలే చూపిస్తున్నామని మంచు విష్ణు తెలిపాడు.
ఇటీవల సంక్రాంతి టైంలో తాను ట్విట్టర్లో జరిపిన చిట్ చాట్ సందర్భంగా కన్నప్పకి సంబంధించి ఎదురైన కొన్ని ప్రశ్నలు తనకు ఇబ్బంది కలిగించాయని విష్ణు తెలిపాడు. కొందరు ఇతర రాష్ట్రాల, ఉత్తరాది నెటిజెన్లు ఈ మైథాలజికల్ ప్రాజెక్టు రిలీజ్ ఎప్పుడు అని నన్ను ప్రశ్నించారని.. కన్నప్పను మైథాలజీ అనడం తనకు బాధ కలిగించిందని విష్ణు తెలిపాడు. మైథాలజీ అంటే హిస్టారికల్ గా ప్రూఫ్ లేనిది అని అర్థం అని.. కన్నప్ప అలాంటి సినిమా కాదని మంచు విష్ణు తెలిపాడు.
నాసా వాళ్లు రామసేతు ఉంది అని అంటే నమ్ముతామని.. కానీ మనకు మనంగా మన చరిత్రను నమ్మమని మంచి విష్ణు వ్యాఖ్యానించాడు. భక్త కన్నప్పకు సంబంధించి పుస్తకాల్లో ఉన్నది ప్రతిదీ నిజంగా జరిగిందే అని.. అందుకు నిదర్శనం శ్రీకాళహస్తీశ్వరాలయం.. అందులోని వాయు లింగం నిదర్శనం అని మంచు విష్ణు వ్యాఖ్యానించాడు. కన్నప్ప మైథాలజికల్ మూవీ కాదని.. నిజమైన శివ భక్తుడు కన్నప్ప కథ అని విష్ణు అన్నాడు.
This post was last modified on January 20, 2024 8:50 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…