రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తరచు బ్రేక్స్ ఇస్తున్నప్పటికీ ఒకవైపు ఇండియన్ 2 పనులు చూసుకుంటూనే ఇంకోపక్క శంకర్ దీన్ని బాలన్స్ చేసే పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు పట్టుదలగా ఉండగా అసలు ఫస్ట్ కాపీ ఎప్పుడు సిద్ధమవుతుందో తెలియని పరిస్థితిలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ముందు వినాయక చవితి అనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని దసరాకు మార్చే దిశగా ప్లానింగ్ జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. అదెలాగో చూద్దాం.
అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఆ మరుసటి రోజు తెలంగాణలో బ్రతుకమ్మ పండగ. సెలవు దినం. ఆపై 4, 5, 6 తేదీలలో లాంగ్ వీకెండ్ వస్తుంది. తిరిగి 11 దుర్గాష్టమి, 12 విజయదశమి, 13 ఆదివారం కలుపుకుని నాన్ స్టాప్ హాలీడేస్ వస్తాయి. ఒకవేళ సినిమా కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే వసూళ్ల ప్రభంజనం మాములుగా ఉండదు. ఏకంగా పది రోజులకు పైగా బాక్సాఫీస్ మీద పట్టు సాధించే అవకాశం దక్కుతుంది. ఇప్పటిదాకా ఆ డేట్ కి ఇతర ప్యాన్ ఇండియా సినిమాలేవీ కర్చీఫ్ వేయలేదు. సో ఈ ఛాన్స్ ఎలాగైనా వదలకూడదని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
భారతీయుడు 2ని ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్. అయితే పుష్ప 2 ఉండటంతో నిర్ధారణకు రాలేకపోతున్నారు. బన్నీ సినిమా వాయిదా పడొచ్చనే ప్రచారం నేపథ్యంలో అదెంత వరకు నిజమవుతుందో తెలియదు కాబట్టి కేవలం ఆ వార్తను నమ్ముకుని డేట్ డిసైడ్ చేస్తే రిస్క్ అవుతుంది. ఇది వచ్చాకే గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉండాలనేది శంకర్ సంకల్పం. దిల్ రాజు మాత్రం తనను కలిసిన అభిమానులను నేను సిద్ధంగానే ఉన్నారు, కాపీ ఎప్పుడు ఇస్తారో మూకుమ్మడిగా శంకర్ ని అడగమని చెబుతున్నారట. భేతాళుడు విక్రమార్కుడిని అడిగినట్టు ఇది ఎప్పటికి వీడుతుందో.
This post was last modified on January 19, 2024 5:38 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…