టాలీవుడ్లో ఒక ఆసక్తికర కాంబినేషన్లో సినిమా మొదలైంది. ఆనంద్ మొదలుకొని లవ్ స్టోరీ వరకు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ ప్రత్యేక పాత్ర చేయబోతుండడం విశేషం. రష్మిక మందన్న ధనుష్ సరసన కథానాయకగా నటించబోతోంది. కమ్ముల చివరి సినిమా లవ్ స్టోరీని నిర్మించిన సునీల్ నారంగే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. దేవదాస్ మూవీ తర్వాత మరోసారి నాగార్జున నటిస్తున్న చిత్రంలో రష్మిక కూడా కనిపించబోతుండడం విశేషం. శేఖర్ కమ్ముల తీస్తున్న తొలి మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో దీని పట్ల ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇది ఒక గ్యాంగ్ స్టార్ మూవీ అని.. శేఖర్ కమ్ముల తొలిసారి యాక్షన్ ప్రధానంగా సినిమా చేస్తున్నాడని అంటున్నారు. విశేషం ఏంటంటే నాగార్జున ధనుష్ కాంబినేషన్లో ఇంతకుముందే ఓ సినిమా రావాల్సింది. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘పవర్ పాండి’ ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్.. దీని తర్వాత ‘రుద్ర’ పేరుతో ఒక భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అందులో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్ర పోషించాల్సింది. కానీ బడ్జెట్, ఇతర సమస్యలతో ఆ సినిమా ఆగిపోయింది.
ఆ తర్వాత గత ఏడాది తన శ్రీధర్శంలో వేరే సినిమా మొదలుపెట్టాడు ధనుష్. అందులో నాగార్జున ఏమి నటించలేదు. కానీ ధనుష్ నాగార్జున కాంబినేషన్ శేఖర్ కమ్ముల కార్యరూపం దాల్చేలా చేశాడు. బహుశా ఇందులో ధనుష్ ప్రోద్బలం కూడా ఉండి ఉండొచ్చు. తన దర్శకత్వంలో చెయ్యాల్సిన సినిమాలో నాగర్జునతో కలిసి నటించకపోయినా. కమ్ముల సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 19, 2024 9:29 am
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…