ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా చెప్పుకుంటున్న కల్కి 2898 ఏడి ఇంకో మూడున్నర నెలల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మే 9 రిలీజ్ డేట్ ని సంక్రాంతి పండగ సందర్భంగా అఫీషిషియల్ గా అనౌన్స్ చేశారు. వైజయంతి బ్యానర్ కు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సెంటిమెంట్ దానికి ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ వదలకూడదని నిర్మాత అశ్వినిదత్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎలాగూ రెండు భాగాలు కాబట్టి ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూట్ దాదాపుగా పూర్తి చేసిన దర్శకుడు నాగఅశ్విన్ ఇంకోవైపు ఇంటర్నేషనల్ ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు.
ఇందులో రెండు ప్రత్యేక అతిథి పాత్రలు ఉంటాయని లేటెస్ట్ అప్డేట్. దుల్కర్ సల్మాన్ క్యామియో చేయడం గురించి గతంలోనే లీక్ వచ్చింది కానీ కొన్ని ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు అతను దాటవేశాడు. టీమ్ నుంచి ప్రకటన వచ్చే దాకా దాని గురించి నోరు విప్పడు కాబట్టి వెయిట్ చేయాలి. ఇక రెండో గెస్టు విజయ్ దేవరకొండని వినికిడి. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నాగ అశ్విన్ తో తనకు బాండింగ్ ఉంది. ఈ కారణంగానే మహానటిలో చిన్న పాత్ర, జాతి రత్నాలులో కొన్ని సెకండ్లు కనిపించే బిట్ చేశాడు. ఇప్పుడు కల్కిలో అంత సింపుల్ గా కాకుండా చెప్పుకోదగ్గ లెన్త్ పెట్టారట.
ఇప్పటికే ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానిలతో క్యాస్టింగ్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచేయగా ఇప్పుడీ స్పెషల్ అతిథులతో రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ గత నాలుగు సినిమాలు చెప్పిన డేట్ కి రాలేక వాయిదాల పాలై కొత్త తేదీలకు థియేటర్లలో అడుగు పెట్టాయి. కానీ కల్కి 2989 ఏడికి ఆ సమస్య రాకుండా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారట. ఆల్రెడీ సంక్రాంతి అనుకుని తర్వాత మేకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ప్రమోషన్లు పెంచబోతున్నారు.
This post was last modified on January 18, 2024 1:51 pm
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు…