ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా చెప్పుకుంటున్న కల్కి 2898 ఏడి ఇంకో మూడున్నర నెలల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మే 9 రిలీజ్ డేట్ ని సంక్రాంతి పండగ సందర్భంగా అఫీషిషియల్ గా అనౌన్స్ చేశారు. వైజయంతి బ్యానర్ కు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సెంటిమెంట్ దానికి ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ వదలకూడదని నిర్మాత అశ్వినిదత్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎలాగూ రెండు భాగాలు కాబట్టి ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూట్ దాదాపుగా పూర్తి చేసిన దర్శకుడు నాగఅశ్విన్ ఇంకోవైపు ఇంటర్నేషనల్ ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు.
ఇందులో రెండు ప్రత్యేక అతిథి పాత్రలు ఉంటాయని లేటెస్ట్ అప్డేట్. దుల్కర్ సల్మాన్ క్యామియో చేయడం గురించి గతంలోనే లీక్ వచ్చింది కానీ కొన్ని ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు అతను దాటవేశాడు. టీమ్ నుంచి ప్రకటన వచ్చే దాకా దాని గురించి నోరు విప్పడు కాబట్టి వెయిట్ చేయాలి. ఇక రెండో గెస్టు విజయ్ దేవరకొండని వినికిడి. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నాగ అశ్విన్ తో తనకు బాండింగ్ ఉంది. ఈ కారణంగానే మహానటిలో చిన్న పాత్ర, జాతి రత్నాలులో కొన్ని సెకండ్లు కనిపించే బిట్ చేశాడు. ఇప్పుడు కల్కిలో అంత సింపుల్ గా కాకుండా చెప్పుకోదగ్గ లెన్త్ పెట్టారట.
ఇప్పటికే ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానిలతో క్యాస్టింగ్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచేయగా ఇప్పుడీ స్పెషల్ అతిథులతో రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ గత నాలుగు సినిమాలు చెప్పిన డేట్ కి రాలేక వాయిదాల పాలై కొత్త తేదీలకు థియేటర్లలో అడుగు పెట్టాయి. కానీ కల్కి 2989 ఏడికి ఆ సమస్య రాకుండా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారట. ఆల్రెడీ సంక్రాంతి అనుకుని తర్వాత మేకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ప్రమోషన్లు పెంచబోతున్నారు.
This post was last modified on January 18, 2024 1:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…