ఒక స్టార్ హీరో 75వ సినిమా అంటే మర్చిపోలేని మైలురాయిగా మిగలాలి. కానీ సైంధవ్ విషయంలో నిరాశ తప్పడం లేదు. ఈ మూవీ కోసం వెంకటేష్ విపరీతంగా కష్టపడ్డారు. సుదీర్ఘమైన నైట్ షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. టైంకి షూటింగ్ పూర్తయ్యేలా ఎక్కువ డేట్లు ఇచ్చారు. ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక యాక్టివ్ ప్రమోషన్లు చేశారు. కాలేజీలకు వెళ్లడం, ఈవెంట్లు హాజరు కావడం, శాటిలైట్ హక్కులు కొన్న ఛానల్ కోసం ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. చిరంజీవి అతిధిగా వెంకీ 75 వేడుకను ఘనంగా నిర్వహిస్తే రానా అండగా దానికీ ముందుండి నడిపించారు.
ఇంత చేసినా సైంధవ్ సంక్రాంతి బరిలో నిలవలేకపోతోంది. గోదావరి, కాకినాడ తదితర ప్రాంతాల్లో కొంత పర్వాలేదు కానీ నైజామ్, సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అనేలా ఎదురీదుతోంది. నిజానికి దీని విషయంలో రెండు తప్పులు జరిగాయి. ఏదో ట్రెండ్ ఉందని గుడ్డిగా యాక్షన్ కథ రాసుకున్న దర్శకుడు శైలేష్ కొలను ట్రీట్ మెంట్ ని సరైన రీతిలో తెరకెక్కించకపోవడంతో పాప ఇంజెక్షన్ చుట్టూ నడిపించిన డ్రామా బోర్ కొట్టించేసింది. పైగా ఎమోషన్ పేరుతో సాగదీసిన సన్నివేశాలు ప్రేక్షకులను సహనంగా కూర్చోబెట్టలేకపోయాయి. లోకేష్ కనగరాజ్ స్టైల్ లో ఏదో ట్రై చేద్దామని బోర్లా పడ్డారు.
ఇంకో అది పెద్ద మిస్టేక్ సంక్రాంతి రిలీజ్ కి సైంధవ్ ని దింపడం. పండక్కు కమర్షియల్ మసాలాలకే ఎక్కువ ఆదరణ ఉంటుందని తెలిసి కూడా రిస్క్ చేశారు. హనుమాన్ ని తక్కువంచనా వేయడం సమూలంగా దెబ్బ కొట్టింది. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే సైంధవ్ బ్లాక్ బస్టర్ అయ్యేది కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితి కన్నా డీసెంట్ వసూళ్లు, ఫీడ్ బ్యాక్ తెచ్చుకునేది. ఇప్పుడు ఏకంగా డిజాస్టర్ ముద్ర ప్రమాదంలో పడింది. గుంటూరు కారంని మహేష్ బాబు ఇమేజ్ అడ్డుగోడలా కాపాడింది కానీ అదే తరహాలో సైంధవ్ ని వెంకీ నిలబెట్టలేకపోయారు. ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
This post was last modified on January 18, 2024 1:34 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…