అక్కినేని హీరోలు అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు మనం ఎంటర్టైన్మెంట్స్ అంటూ మరో బ్యానర్ కూడా స్థాపించారు. ఆ సంస్థపై వరుసగా సినిమాలు వస్తాయనే అభిమానులు భావించారు. కానీ స్వీయ నిర్మాణంలో వున్న తలనొప్పులు నాగార్జునకు నచ్చడం లేదు. తాను నిర్మించే సినిమాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని నాగార్జున అనుకుంటారు. గతంలో ఆయన హీరోగా నటించిన సినిమాలు మాత్రమే నిర్మించేప్పుడు అది కష్టం కాలేదు.
కానీ తనయులు హీరోలయ్యాక వారి సినిమాల నిర్మాణంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవడం కుదరడం లేదు. అదీ కాక తనకు మంచి పారితోషికం ఆఫర్ చేస్తున్నారు. చైతన్యకు కూడా అయిదు కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నారు. అఖిల్ ఇంకా బ్యాంకబుల్ స్టార్ కాకపోయినా కానీ అతనికీ పారితోషికం బాగానే ఇస్తున్నారు. ఇలా నటిస్తే కోట్లు వచ్చి పడుతున్నపుడు నిర్మాణం చేపట్టి ఆ రిస్క్ అంతా ఎందుకు భరించాలని నాగార్జున డిసైడ్ అయ్యారు.
అందుకే నిర్మాణానికి దూరంగా వుంటూ చివరకు తనయుల చిత్రాలు నిర్మించడానికి కూడా ససేమీరా అనేస్తున్నారు. నాగార్జున ఇదే మైండ్సెట్తో వుంటే లాక్డౌన్కి ముందు ప్లాన్ చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ సినిమా బహుశా ఇక వుండకపోవచ్చు.
This post was last modified on September 5, 2020 12:14 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…