సంక్రాంతి సినిమాల్లో సైంధవ్ చివరి స్థానంలో నిలవడం ఖరారైపోయినట్టే. ప్రధాన కేంద్రాల్లో వసూళ్లు డీసెంట్ గా కనిపిస్తున్నా వాటిలో చాలా మటుకు హనుమాన్ తో పాటు ఇతర చిత్రాల ఓవర్ ఫ్లోస్ వల్ల వచ్చినవేనని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. వెంకటేష్ ఫ్యామిలీ ఇమేజ్ కన్నా కంటెంట్ లోని ఓవర్ సీరియస్ నెస్ గురించి వచ్చిన టాకే ఆడియన్స్ ని దూరం చేస్తున్న మాట వాస్తవం. దర్శకుడు శైలేష్ కొలను ప్రెజెంటేషన్ మరీ దారుణంగా లేకపోయినా ఫీడ్ బ్యాక్ ఇంత వీక్ గా రావడానికి సగం కారణం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణనని చెప్పక తప్పదు. ఫ్యాన్స్ కంప్లయింట్ కూడా ఇదే.
గత ఏడాది నాని దసరాకు అదిరిపోయే పాటలతో పాటు సూపర్ బీజీఎమ్ ఇచ్చిన సంతోష్ ఇప్పుడు సైంధవ్ విషయంలో చేతులు ఎత్తేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ ఒక్క సాంగ్ పబ్లిక్ లో పూర్తిగా రిజిస్టర్ కాలేదు. వైరల్ కావడం దేవుడెరుగు కనీసం ఛార్ట్ బస్టర్ అనిపించులేక పోయాయి. ఇంట్రో తర్వాత మందు కొట్టే పాటతో మొదలుపెట్టి చివర్లో ఎమోషనల్ సాంగ్ దాకా అన్నీ సోసోనే. ఇక వెంకీ ఊర మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎంత గొప్పగా నటించినా సరిగా ఎలివేట్ కాకపోవడానికి కారణం నేపధ్య సంగీతం అంతగా సింక్ అవ్వకపోవడమే. దీంతో సినిమా నీరసంగా అనిపిస్తుంది.
ఇది రాబట్టుకోలేని శైలేష్ తప్పా లేక ఇవ్వలేని సంతోష్ తప్పా అంటే సమాధానం వాళ్ళిద్దరికే తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పోటీలో ఉన్న సినిమాలు అన్నింటిలో ఎలాంటి ఒత్తిడి లేకుండా టైంకి షూటింగ్ పూర్తి చేసుకున్నది సైంధవే. అంటే సంతోష్ నారాయణన్ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. అలాంటప్పుడు బెస్ట్ ఆశించడంలో తప్పేమీ లేదు. అనిరుద్ రవిచందర్ వల్లే జైలర్, లియో, విక్రమ్ స్థాయి పెరిగిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంత కాకపోయినా కనీసం అందులో సగం అందుకున్నా చాలు సైంధవ్ కాస్త ఎక్కువ జనాలకు రీచ్ అయ్యుండేదేమో. కానీ జరగలేదు.
This post was last modified on January 16, 2024 10:54 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…