ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ సిఈఓ హైదరాబాద్ వచ్చినప్పుడు మన స్టార్ హీరోలందరి ఇంటింకి వెళ్లి వాళ్ళతో టిఫిన్లు, భోజనాలు చేసి ఫోటోలు దిగడం ఎంత వైరలయ్యిందో చూశాం. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు కొంటే చాలు ఇండియా మార్కెట్ కి సరిపోతుందనుకునే స్టేజి నుంచి టాలీవుడ్ లో ఎంత బంగారం ఉందో అర్థం చేసుకునే స్థితికి సదరు కంపెనీ పెద్దలు వచ్చేశారు. అందుకే భారీ ఎత్తున వందల కోట్ల పెట్టుబడులతో 2024లో విడుదల కాబోతున్న క్రేజీ సినిమాల్లో అధిక శాతం కొనేశారు. వాటి తాలూకు అఫీషియల్ అనౌన్స్ మెంట్లతో తెలుగు మూవీ లవర్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ దేవర 1, అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్, విజయ్ దేవరకొండ 12, సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, బాలకృష్ణ 109, కార్తికేయ హీరోగా యాక్షన్ మూవీ(సితార బ్యానర్), సిద్దార్థ్-అదితి రావుహైదరి హరిలోరంగ హరి, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, అల్లు శిరీష్ టెడ్డి, ప్రభాస్ సలార్, ఎస్విసిసి 37, నితిన్ నార్నే 2 ఇప్పటిదాకా ప్రకటించిన లిస్టులో ఉన్నాయి. ఇంకొన్ని వచ్చినా ఆశ్చర్యం లేదు. కోలీవుడ్ కు సంబంధించిన నోట్స్ వేరుగా ఉంటాయి. ఎలా చూసుకున్నా కేవలం ఇక్కడ చెప్పిన వాటి ఓటిటి హక్కులు కొనేందుకు అయిదారు వందల కోట్లకు పైగానే నెట్ ఫ్లిక్స్ ఖర్చు పెట్టి ఉంటుంది.
దీన్ని బట్టి తెలుగు మార్కెట్ ఎంత విస్తృతంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయిన నెట్ ఫ్లిక్స్ దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకుంది. మన డిజాస్టర్లు సైతం భారీ సంఖ్యలో మిలియన్ వ్యూస్ తెచ్చి పెట్టాయి. పైగా బహుబాషల్లో టాలీవుడ్ సినిమాలకు రీచ్ ఎక్కువగా ఉండటంతో డిజిటల్ రేట్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. పుష్ప 2 కోసం అమెజాన్ ప్రైమ్ ఎంత పోటీ ఇచ్చినా నిర్మాతలకు కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చి మరీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. నెట్ ఫ్లిక్స్ పండగ క్యాప్షన్ కి నిజంగానే న్యాయం చేకూర్చారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…