బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తున్న హనుమాన్ తెలుగు నుంచి హిందీ దాకా అన్ని చోట్ల ఒకే రేంజ్ లో సునామి సృష్టిస్తోంది. తమిళనాడు, కేరళ లాంటి కొన్ని చోట్ల స్థానిక కారణాల వల్ల భారీ స్పందన లేదు కానీ మిగిలిన ప్రాంతాల్లో ర్యాంపేజ్ అనే మాట కరెక్ట్. దీనికి సీక్వెల్ ఉంటుందని, టైటిల్ జై హనుమాన్ ఫిక్స్ చేశామని ఎండ్ టైటిల్ కార్డులో ఆల్రెడీ చెప్పేసిన సంగతి తెలిసిందే. 2025 విడుదలని అందులో స్పష్టం చేయడంతో ఇప్పుడు ఫలితం చూశాక సీక్వెల్ అంచనాలు పెరుగుతున్నాయి. దీని గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
జై హనుమాన్ ప్రపంచం వేరుగా ఉంటుందట. తేజ సజ్జ ఉండే అంజనాద్రి చుట్టూ కాకుండా హనుమంతుడు రాముడికి ఏం మాట ఇచ్చాడు, విభీషణుడు చెప్పినట్టు ప్రపంచానికి రాబోయే ముప్పు ఏంటి అనే దాని చుట్టూ ఇంకా పెద్ద స్కేల్ లో చూపించబోతున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తేజ సజ్జ ఉంటాడు కానీ ఫుల్ లెన్త్ రోల్ కాదని చెబుతున్నాడు. క్యాస్టింగ్ మొత్తం వేరే ఉంటారని, మొదటి భాగంలో కేవలం కొన్ని నిముషాలు మాత్రమే నిజ దర్శనం ఇచ్చిన హనుమాన్ ని ఈసారి పూర్తిగా చూపిస్తానని అంటున్నాడు. సినిమాటిక్ యునివర్స్ లో ఇదీ భాగమేనని అంటున్నాడు.
సో ఈ లెక్కన జై హనుమాన్ మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చో అర్థమవుతోంది. వచ్చే ఏడాది విడుదల ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ప్రశాంత్ వర్మకే క్లారిటీ లేదు. సంక్రాంతికి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే చేతిలో ఉన్న పదకొండు నెలల్లో ఇంత పెద్ద స్కేల్ తో ప్యాన్ ఇండియా మూవీ తీసి సిద్ధం చేయడం సులభం కాదు. పైగా ప్రశాంత్ వర్మ తీసిన మరో చిన్న బడ్జెట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రిలీజ్ కు రెడీగా ఉంది. దానికంటూ ఓ రెండు నెలలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే జై హనుమాన్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ అంచనాలు నిలబెట్టుకోవడమే ఛాలెంజ్.
This post was last modified on January 15, 2024 7:11 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…