Movie News

BMS ఫేక్ రేటింగులపై గుంటూరు కారం సీరియస్

ఉద్దేశపూర్వకంగా గుంటూరు కారంకు బుక్ మై షోలో ఎక్కువ నెగటివ్ రేటింగ్స్ వచ్చేలా ఒక బృందం పని చేసిందని ఫిర్యాదు చేస్తూ నిర్మాతలు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ చిత్రానికి 6.6 రేటింగ్ ఉంది. మాములుగా జనం మొదటి రోజే తిరస్కరించిన డిజాస్టర్లకు సైతం 7 నుంచి 9 మధ్యలో ఉంటుంది. కానీ గుంటూరు కారం అంత దారుణంగా లేదని కలెక్షన్లు తేటతెల్లం చేస్తున్నాయి. మిక్స్డ్ టాక్ ఉన్న మాట వాస్తవమే కానీ మరీ ఫ్యామిలీస్ దూరంగా ఉండే రేంజ్ అయితే కాదు. ఆ మాటకొస్తే యూత్ కన్నా కుటుంబ ప్రేక్షకులే ఎక్కువ వస్తున్నారు.

సుమారు 70 వేలకు పైగా ఇలా బాట్ టెక్నాలజీ వాడి రేటింగ్స్ ఇవ్వడం వల్ల అనవసరమైన నెగటివ్ ప్రాపగండా జరుగుతోందని హారికా హాసిని అభియోగం. నిజానికి ఈ బిఎంఎస్, ఐఎండిబి రేటింగులు దేనికీ ప్రామాణికం కావు. వాటిలో విశ్వసనీయత వెనుక ఎన్నో అనుమానాలున్నాయి. ఆ మధ్య ఇండియన్ టాప్ 250 మూవీస్ లిస్టుని ప్రకటించినప్పుడు అందులో విశ్వనాథ్ గారి క్లాసిక్స్ ఒక్కటీ లేకపోవడం బట్టే చెప్పొచ్చు ఐఎండిబి ఏ పద్ధతి మీద రివ్యూలు చేస్తుందో. ఇప్పుడీ బుక్ మై షో స్కామ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టాల్సిన బాధ్యత సైబర్ క్రైమ్ మీద ఉంది. అంత సులభమైతే కాదు.

ఇలాంటివి కట్టడి చేయడం అవసరమే. భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలకు ఈ సమస్య మళ్ళీ మళ్ళీ తలెత్తే అవకాశం లేకపోలేదు. కొందరు ఈ రేటింగ్స్ చూసి టికెట్లు బుక్ చేసుకునే ట్రెండ్ ని ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఖచ్చితంగా వసూళ్ల మీద ప్రభావం ఉంటుంది. తరచూ యూట్యూబ్ లోనూ ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. గుంటూరు కారం టీమ్ కి ఎలాంటి న్యాయం జరుగుతోందో చూసి దాన్ని బట్టి భవిష్యత్తులో మిగిలిన నిర్మాతలు అలెర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి కొత్త తరహా స్కామ్ లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

33 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago