Movie News

టికెట్ రేట్లు ప్రభావం చూపిస్తున్నాయి

బడ్జెట్ రికవరీ కోసం అధికంగా పెడుతున్న టికెట్ రేట్లు డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తాయో గుంటూరు కారం విషయంలో కనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ మల్టీప్లెక్సులో ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే గరిష్టంగా 460 రూపాయల దాకా ఖర్చు కావడం సామాన్యులను థియేటర్లకు వచ్చే విషయంలో ఆలోచించేలా ప్రేరేపిస్తోంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు. కానీ టాక్ కొంచెం అటుఇటు ఊగినప్పుడు మాత్రం జాగ్రత్త పడాల్సిందే. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఎవరూ గమనించకుండా లేరు.

వీలైనంత త్వరగా టికెట్ ధరలను సాధారణ స్థితికి తేవడం అవసరం. ఎందుకంటే పోటీలో ఉన్న మిగిలిన నాలుగు సినిమాలు హైక్ కోరలేదు. మాగ్జిమం ఉన్న పరిమితి లోపలే ఫిక్స్ చేసుకోవడంతో అది కాస్తా సానుకూలంగా మారుతోంది. హనుమాన్ దూకుడు అందుకే ఆశించిన దానికన్నా ఎక్కువగా ఉంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తరహా ప్రభంజనం చూపిస్తోంది. సైంధవ్, నా సామిరంగలు సైతం ఇదే స్ట్రాటజీ ఫాలో కావడంతో ఒక్క గుంటూరు కారమే అన్నింటి కన్నా ఖరీదుగా మారిపోయింది. ఫస్ట్ డే రికార్డులు వచ్చి ఉండొచ్చు కానీ తర్వాత నిలవడం చాలా కీలకం.

అభిమానుల ఫీడ్ బ్యాక్ ని గమనిస్తున్న గుంటూరు కారం బృందం ఇంకా సక్సెస్ మీట్ లాంటి ప్లానింగ్ ఏదీ ప్రకటించలేదు. వసూళ్లకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేస్తుంది. పండగ సెలవులు ఉండటంతో ఆక్యుపెన్సీలు బాగున్నాయి కానీ ఒకవేళ నైజామ్ రేట్లు కనక అదుపులోకి వస్తే మరింత మెరుగ్గా వసూళ్లు పెరుగుతాయని బయ్యర్లు అంటున్నారు. ఏపీలో 50 రూపాయల పెంపే కాబట్టి అక్కడ ఇబ్బంది మరీ తీవ్రంగా లేదు. హనుమాన్ పాజిటివ్ టాక్ తో పాటు సైంధవ్, నా సామిరంగల ఫలితాలు వచ్చాక ఏవి చూడాలో డిసైడ్ చేద్దామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ లక్షల్లో ఉన్నారు.

This post was last modified on January 13, 2024 7:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

52 minutes ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

53 minutes ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

10 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago