బడ్జెట్ రికవరీ కోసం అధికంగా పెడుతున్న టికెట్ రేట్లు డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తాయో గుంటూరు కారం విషయంలో కనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ మల్టీప్లెక్సులో ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే గరిష్టంగా 460 రూపాయల దాకా ఖర్చు కావడం సామాన్యులను థియేటర్లకు వచ్చే విషయంలో ఆలోచించేలా ప్రేరేపిస్తోంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు. కానీ టాక్ కొంచెం అటుఇటు ఊగినప్పుడు మాత్రం జాగ్రత్త పడాల్సిందే. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఎవరూ గమనించకుండా లేరు.
వీలైనంత త్వరగా టికెట్ ధరలను సాధారణ స్థితికి తేవడం అవసరం. ఎందుకంటే పోటీలో ఉన్న మిగిలిన నాలుగు సినిమాలు హైక్ కోరలేదు. మాగ్జిమం ఉన్న పరిమితి లోపలే ఫిక్స్ చేసుకోవడంతో అది కాస్తా సానుకూలంగా మారుతోంది. హనుమాన్ దూకుడు అందుకే ఆశించిన దానికన్నా ఎక్కువగా ఉంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తరహా ప్రభంజనం చూపిస్తోంది. సైంధవ్, నా సామిరంగలు సైతం ఇదే స్ట్రాటజీ ఫాలో కావడంతో ఒక్క గుంటూరు కారమే అన్నింటి కన్నా ఖరీదుగా మారిపోయింది. ఫస్ట్ డే రికార్డులు వచ్చి ఉండొచ్చు కానీ తర్వాత నిలవడం చాలా కీలకం.
అభిమానుల ఫీడ్ బ్యాక్ ని గమనిస్తున్న గుంటూరు కారం బృందం ఇంకా సక్సెస్ మీట్ లాంటి ప్లానింగ్ ఏదీ ప్రకటించలేదు. వసూళ్లకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేస్తుంది. పండగ సెలవులు ఉండటంతో ఆక్యుపెన్సీలు బాగున్నాయి కానీ ఒకవేళ నైజామ్ రేట్లు కనక అదుపులోకి వస్తే మరింత మెరుగ్గా వసూళ్లు పెరుగుతాయని బయ్యర్లు అంటున్నారు. ఏపీలో 50 రూపాయల పెంపే కాబట్టి అక్కడ ఇబ్బంది మరీ తీవ్రంగా లేదు. హనుమాన్ పాజిటివ్ టాక్ తో పాటు సైంధవ్, నా సామిరంగల ఫలితాలు వచ్చాక ఏవి చూడాలో డిసైడ్ చేద్దామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ లక్షల్లో ఉన్నారు.
This post was last modified on January 13, 2024 7:40 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…